మల్లమ్మ అంత్యక్రియలకు ఎడ్ల మహేందర్ రెడ్డి ఆర్థిక సహాయం
మల్లమ్మ అంత్యక్రియలకు ఎడ్ల మహేందర్ రెడ్డి ఆర్థిక సహాయం
Editor Desk
రామన్నపేటస్థానికం ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు నకిరేకంటి ఎల్లయ్య తల్లి నకిరేకంటి మల్లమ్మ (85) అనారోగ్యంతో మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. మల్లమ్మ భౌతిక కాయాన్ని సందర్శించిన వెల్లంకి గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5,000 నగదు అందజేశారు. బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి పిట్టె మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు తలారి నరసింహ, సీనియర్ నాయకులు ఎడ్ల నరేందర్రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు సండ్ల లింగయ్య, నకిరేకంటి నరేష్ కుమార్, జినుక శాంతి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి