Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:53 AM

మల్కాజ్‌గిరి అభివృద్ధిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్‌గిరి అభివృద్ధిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్‌గిరి అభివృద్ధిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
28-12-2025 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మల్కాజ్‌గిరి | స్థానికం

మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. గోపాల్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో, ఉత్తమ్‌నగర్ నుంచి జ్యోతి నగర్ వరకు ఉన్న వివిధ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు బాక్స్ డ్రైన్లు, త్రాగునీరు, ట్రాఫిక్ సమస్యలు, ఆర్‌యూబీ నిర్మాణం, పారిశుద్ధ్యం, డ్రైనేజీ ఓవర్‌ఫ్లో తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

గౌతమ్‌నగర్ త్రాగునీటి సమస్యకు మహేంద్రహిల్స్‌లో రూ.15 కోట్లతో వాటర్ రిజర్వాయర్, ఏఓసీ 100 అడుగుల రోడ్లు రూ.900 కోట్లతో అభివృద్ధి, గౌతమ్‌నగర్–వాజ్‌పేయి నగర్ ఆర్‌యూబీలు ఒక్క ఇల్లు కోల్పోకుండా నిర్మాణం, విద్యుత్ శాఖ ద్వారా రూ.42 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.

ఈ సమావేశంలో పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, నాయకులు, కార్పొరేటర్, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Sthanikam

మల్కాజ్‌గిరి అభివృద్ధిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

Article Image

మల్కాజ్‌గిరి | స్థానికం

మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. గోపాల్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో, ఉత్తమ్‌నగర్ నుంచి జ్యోతి నగర్ వరకు ఉన్న వివిధ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు బాక్స్ డ్రైన్లు, త్రాగునీరు, ట్రాఫిక్ సమస్యలు, ఆర్‌యూబీ నిర్మాణం, పారిశుద్ధ్యం, డ్రైనేజీ ఓవర్‌ఫ్లో తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

గౌతమ్‌నగర్ త్రాగునీటి సమస్యకు మహేంద్రహిల్స్‌లో రూ.15 కోట్లతో వాటర్ రిజర్వాయర్, ఏఓసీ 100 అడుగుల రోడ్లు రూ.900 కోట్లతో అభివృద్ధి, గౌతమ్‌నగర్–వాజ్‌పేయి నగర్ ఆర్‌యూబీలు ఒక్క ఇల్లు కోల్పోకుండా నిర్మాణం, విద్యుత్ శాఖ ద్వారా రూ.42 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.

ఈ సమావేశంలో పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, నాయకులు, కార్పొరేటర్, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News