Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:35 PM

మల్కాజ్‌గిరి అభివృద్ధిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్‌గిరి అభివృద్ధిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్‌గిరి అభివృద్ధిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
December 28, 2025 06:31 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మల్కాజ్‌గిరి | స్థానికం

మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. గోపాల్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో, ఉత్తమ్‌నగర్ నుంచి జ్యోతి నగర్ వరకు ఉన్న వివిధ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు బాక్స్ డ్రైన్లు, త్రాగునీరు, ట్రాఫిక్ సమస్యలు, ఆర్‌యూబీ నిర్మాణం, పారిశుద్ధ్యం, డ్రైనేజీ ఓవర్‌ఫ్లో తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

గౌతమ్‌నగర్ త్రాగునీటి సమస్యకు మహేంద్రహిల్స్‌లో రూ.15 కోట్లతో వాటర్ రిజర్వాయర్, ఏఓసీ 100 అడుగుల రోడ్లు రూ.900 కోట్లతో అభివృద్ధి, గౌతమ్‌నగర్–వాజ్‌పేయి నగర్ ఆర్‌యూబీలు ఒక్క ఇల్లు కోల్పోకుండా నిర్మాణం, విద్యుత్ శాఖ ద్వారా రూ.42 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.

ఈ సమావేశంలో పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, నాయకులు, కార్పొరేటర్, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News