మల్కాజ్గిరి అభివృద్ధిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజ్గిరి అభివృద్ధిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
Editor Desk
మల్కాజ్గిరి | స్థానికం
మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. గోపాల్నగర్ కమ్యూనిటీ హాల్లో, ఉత్తమ్నగర్ నుంచి జ్యోతి నగర్ వరకు ఉన్న వివిధ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు బాక్స్ డ్రైన్లు, త్రాగునీరు, ట్రాఫిక్ సమస్యలు, ఆర్యూబీ నిర్మాణం, పారిశుద్ధ్యం, డ్రైనేజీ ఓవర్ఫ్లో తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
గౌతమ్నగర్ త్రాగునీటి సమస్యకు మహేంద్రహిల్స్లో రూ.15 కోట్లతో వాటర్ రిజర్వాయర్, ఏఓసీ 100 అడుగుల రోడ్లు రూ.900 కోట్లతో అభివృద్ధి, గౌతమ్నగర్–వాజ్పేయి నగర్ ఆర్యూబీలు ఒక్క ఇల్లు కోల్పోకుండా నిర్మాణం, విద్యుత్ శాఖ ద్వారా రూ.42 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.
ఈ సమావేశంలో పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, నాయకులు, కార్పొరేటర్, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి