Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:06 PM

మల్గి గ్రామంలో కెమికల్ పరిశ్రమ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఐఎన్‌హెచ్‌ఆర్‌పీసీ పిలుపు

మల్గి గ్రామంలో కెమికల్ పరిశ్రమ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఐఎన్‌హెచ్‌ఆర్‌పీసీ పిలుపు

మల్గి గ్రామంలో కెమికల్ పరిశ్రమ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఐఎన్‌హెచ్‌ఆర్‌పీసీ పిలుపు
January 02, 2026 08:16 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో న్యాల్కల్ మండలం మల్గి గ్రామం సమీపంలో కెమికల్ కంపెనీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం రేపు (జనవరి 3, 2026) ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించనున్నట్లు ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డిగ్గే బాబు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి కెమికల్ కంపెనీల వల్ల పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యం, జీవనాధారాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందన్నారు. గాలి, నీరు, మట్టి తీవ్రంగా కాలుష్యం చెంది ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే మల్గి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ కంపెనీ ఏర్పాటుకు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ప్రజల హక్కులు, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని డాక్టర్ డిగ్గే బాబు స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు తమ మద్దతును కోరుతున్న నేపథ్యంలో, సంగారెడ్డి జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ఐఎన్‌హెచ్‌ఆర్‌పీసీ సభ్యులు అందరూ రేపు జరిగే ప్రజాభిప్రాయ సేకరణ సమావేశానికి హాజరై కెమికల్ కంపెనీకి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతూ ప్రజలకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

“ప్రజల ఆరోగ్యం, జీవన హక్కులను కాపాడటం మన బాధ్యత. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకుండా అభివృద్ధి పేరుతో కాలుష్యాన్ని మోపడం అన్యాయం” అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల గొంతుకను బలంగా వినిపించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News