Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:31 AM

మాకు న్యాయం చేయండి మహా ప్రభో

మాకు న్యాయం చేయండి మహా ప్రభో

మాకు న్యాయం చేయండి మహా ప్రభో
February 23, 2026 07:13 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రైతు లక్ష్మీదేవమ్మతో పాటు కుమారుడు డేరంగుల శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒడిసి మండలంలోని సున్నంపల్లి గ్రామ పొలంలో సర్వేనెంబర్ 1006-1 లో 4 ఎకరాల 37 సెంట్లు భూమిని, 1987 సంవత్సరంలో తన తండ్రి గారైన డేరంగుల రంగప్ప పేరుమీద ప్రభుత్వం డి.పట్టా మంజూరు చేసిందన్నారు.అప్పటినుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నాకు ఉన్న మొత్తం 4-37 ఎకరాల భూమిలో 1-47 ఎకరాలు భూమిని ఓడిసి మండల రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేసి ఇతరుల పేరు మీదికి ఆన్లైన్ చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తన తండ్రి రంగప్ప అన్యాక్రాంతమైన తమ భూమిని తమ పేరు మీద ఎక్కించాలని గత 10 సంవత్సరాల నుంచి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి చివరకు మరణించారని శ్రీనివాస్ తెలిపారు.ప్రస్తుతం మూడేళ్ల నుంచి మండల మరియు డివిజన్ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ కొంతమంది అధికారులకు ఆమ్యామ్యాలు అందజేసిన కూడా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు.కావున కలెక్టర్ మా భూమిపై ఆన్లైన్ లో వున్న ఇతరుల పేరును తొలగించి, మాభూమి మాకు ఆన్లైన్లో పొందుపరిచి పాసుబుక్కు మంజూరు అయ్యేవిధంగా న్యాయం చేయాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News