Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:50 PM

మాకు న్యాయం చేయండి మహా ప్రభో

మాకు న్యాయం చేయండి మహా ప్రభో

మాకు న్యాయం చేయండి మహా ప్రభో
February 23, 2026 07:13 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రైతు లక్ష్మీదేవమ్మతో పాటు కుమారుడు డేరంగుల శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒడిసి మండలంలోని సున్నంపల్లి గ్రామ పొలంలో సర్వేనెంబర్ 1006-1 లో 4 ఎకరాల 37 సెంట్లు భూమిని, 1987 సంవత్సరంలో తన తండ్రి గారైన డేరంగుల రంగప్ప పేరుమీద ప్రభుత్వం డి.పట్టా మంజూరు చేసిందన్నారు.అప్పటినుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నాకు ఉన్న మొత్తం 4-37 ఎకరాల భూమిలో 1-47 ఎకరాలు భూమిని ఓడిసి మండల రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేసి ఇతరుల పేరు మీదికి ఆన్లైన్ చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తన తండ్రి రంగప్ప అన్యాక్రాంతమైన తమ భూమిని తమ పేరు మీద ఎక్కించాలని గత 10 సంవత్సరాల నుంచి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి చివరకు మరణించారని శ్రీనివాస్ తెలిపారు.ప్రస్తుతం మూడేళ్ల నుంచి మండల మరియు డివిజన్ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ కొంతమంది అధికారులకు ఆమ్యామ్యాలు అందజేసిన కూడా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు.కావున కలెక్టర్ మా భూమిపై ఆన్లైన్ లో వున్న ఇతరుల పేరును తొలగించి, మాభూమి మాకు ఆన్లైన్లో పొందుపరిచి పాసుబుక్కు మంజూరు అయ్యేవిధంగా న్యాయం చేయాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News