మాకు న్యాయం చేయండి మహా ప్రభో
మాకు న్యాయం చేయండి మహా ప్రభో
Anjali
సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రైతు లక్ష్మీదేవమ్మతో పాటు కుమారుడు డేరంగుల శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒడిసి మండలంలోని సున్నంపల్లి గ్రామ పొలంలో సర్వేనెంబర్ 1006-1 లో 4 ఎకరాల 37 సెంట్లు భూమిని, 1987 సంవత్సరంలో తన తండ్రి గారైన డేరంగుల రంగప్ప పేరుమీద ప్రభుత్వం డి.పట్టా మంజూరు చేసిందన్నారు.అప్పటినుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నాకు ఉన్న మొత్తం 4-37 ఎకరాల భూమిలో 1-47 ఎకరాలు భూమిని ఓడిసి మండల రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేసి ఇతరుల పేరు మీదికి ఆన్లైన్ చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తన తండ్రి రంగప్ప అన్యాక్రాంతమైన తమ భూమిని తమ పేరు మీద ఎక్కించాలని గత 10 సంవత్సరాల నుంచి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి చివరకు మరణించారని శ్రీనివాస్ తెలిపారు.ప్రస్తుతం మూడేళ్ల నుంచి మండల మరియు డివిజన్ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ కొంతమంది అధికారులకు ఆమ్యామ్యాలు అందజేసిన కూడా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు.కావున కలెక్టర్ మా భూమిపై ఆన్లైన్ లో వున్న ఇతరుల పేరును తొలగించి, మాభూమి మాకు ఆన్లైన్లో పొందుపరిచి పాసుబుక్కు మంజూరు అయ్యేవిధంగా న్యాయం చేయాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి