Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:48 PM

మాజీ ఎమ్మెల్యే,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్‌కు శాలువాలతో సన్మానం

మాజీ ఎమ్మెల్యే,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్‌కు శాలువాలతో సన్మానం

మాజీ ఎమ్మెల్యే,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్‌కు శాలువాలతో సన్మానం
February 02, 2026 06:17 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్ద మండలం ఇరాక్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు, న్యాయవాది తులసీరామ్ నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మాజీ శాసనసభ్యుడు మహారెడ్డి భూపాల్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రతి తండాను గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడం, తండాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించడం, రవాణా సౌకర్యాల కోసం బీటి రహదారుల నిర్మాణానికి కృషి చేయడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినందుకు ఆయన ప్రశంసలు తెలిపారు. అలాగే వెనుకబడిన గిరిజన సోదరులు విద్యలో ముందుండేలా గిరిజన గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం, గిరిజనులకు రిజర్వేషన్ల కల్పనలో కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు.గిరిజనుల అభ్యున్నతికి రామ్ రావు మహారాజు ట్రస్ట్ నిర్మాణం కోసం ఇరవై గుంటల స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడంలో చూపిన దూరదృష్టికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి దోహదపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ సభ్యురాలు లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు ఉబేద్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News