Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:57 AM

మాజీ ఎమ్మెల్యే,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్‌కు శాలువాలతో సన్మానం

మాజీ ఎమ్మెల్యే,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్‌కు శాలువాలతో సన్మానం

మాజీ ఎమ్మెల్యే,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్‌కు శాలువాలతో సన్మానం
February 02, 2026 06:17 PM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్ద మండలం ఇరాక్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు, న్యాయవాది తులసీరామ్ నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మాజీ శాసనసభ్యుడు మహారెడ్డి భూపాల్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రతి తండాను గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడం, తండాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించడం, రవాణా సౌకర్యాల కోసం బీటి రహదారుల నిర్మాణానికి కృషి చేయడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినందుకు ఆయన ప్రశంసలు తెలిపారు. అలాగే వెనుకబడిన గిరిజన సోదరులు విద్యలో ముందుండేలా గిరిజన గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం, గిరిజనులకు రిజర్వేషన్ల కల్పనలో కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు.గిరిజనుల అభ్యున్నతికి రామ్ రావు మహారాజు ట్రస్ట్ నిర్మాణం కోసం ఇరవై గుంటల స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడంలో చూపిన దూరదృష్టికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి దోహదపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ సభ్యురాలు లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు ఉబేద్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News