Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:08 AM

మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జీఎంఆర్

మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జీఎంఆర్

మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జీఎంఆర్
February 20, 2026 04:58 PM 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం సీనియర్ నాయకుడు, సుక్కల్తిర్త్ గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ వారి నివాసానికి చేరుకొని ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.అనంతరం మాట్లాడుతూ తక్కువ కాలం సాన్నిహిత్యం ఉన్నప్పటికీ మంచి మిత్రుడిని కోల్పోయిన బాధ కలిగిందన్నారు. ఒక్కగానొక్క తనయుడు తండ్రిని కోల్పోయిన దృశ్యం హృదయాన్ని కలచివేసిందని తెలిపారు. యువ నాయకుడిగా, ప్రజల సమస్యలపై కట్టుబాటుతో పనిచేసే మంచి నాయకత్వాన్ని కోల్పోయామని పేర్కొన్నారు. రమేష్ పటేల్ సేవలు గ్రామ ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ దుఃఖాన్ని భరించే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సాగర సంగం గౌరవ అధ్యక్షుడు కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ అంజయ్య సాగర్, మాజీ సర్పంచ్లు సిద్దు, పుండ్లిక్, విజయ్ రావు, సాయిలు, సురేందర్ పటేల్, నాయకులు సంతోష్ రావు పటేల్, జీవన్ రావ్ పటేల్, శంకర్, సాగర్, సాయిలు, రామ్ దాస్, మండల పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News