Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:12 PM

మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జీఎంఆర్

మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జీఎంఆర్

మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జీఎంఆర్
February 20, 2026 04:58 PM 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం సీనియర్ నాయకుడు, సుక్కల్తిర్త్ గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ వారి నివాసానికి చేరుకొని ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.అనంతరం మాట్లాడుతూ తక్కువ కాలం సాన్నిహిత్యం ఉన్నప్పటికీ మంచి మిత్రుడిని కోల్పోయిన బాధ కలిగిందన్నారు. ఒక్కగానొక్క తనయుడు తండ్రిని కోల్పోయిన దృశ్యం హృదయాన్ని కలచివేసిందని తెలిపారు. యువ నాయకుడిగా, ప్రజల సమస్యలపై కట్టుబాటుతో పనిచేసే మంచి నాయకత్వాన్ని కోల్పోయామని పేర్కొన్నారు. రమేష్ పటేల్ సేవలు గ్రామ ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ దుఃఖాన్ని భరించే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సాగర సంగం గౌరవ అధ్యక్షుడు కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ అంజయ్య సాగర్, మాజీ సర్పంచ్లు సిద్దు, పుండ్లిక్, విజయ్ రావు, సాయిలు, సురేందర్ పటేల్, నాయకులు సంతోష్ రావు పటేల్, జీవన్ రావ్ పటేల్, శంకర్, సాగర్, సాయిలు, రామ్ దాస్, మండల పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News