PRINT TIME: May 09, 2026 02:30 PM
మాజీ సర్పంచ్ గంగప్ప మృతి -నివాళులు అర్పించిన మాజీ మంత్రి
మాజీ సర్పంచ్ గంగప్ప మృతి -నివాళులు అర్పించిన మాజీ మంత్రి
May 09, 2026 12:44 PM
2 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కోగిర గ్రామ మాజీ సర్పంచ్ గంగప్ప అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే గ్రామ ప్రజలు, మిత్రులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో వారి నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కోగిర గ్రామానికి చేరుకున్నారు. గంగప్ప గారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. “గంగప్ప గ్రామ అభివృద్ధికి ఎంతో సేవ చేశారు, వారి సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి” అని పేర్కొన్నారు.
గ్రామంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని గంగప్ప గారికి చివరి వీడ్కోలు పలికారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి