Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తండ్రి ఆశయాలకు నిలువెత్తు నివాళిగా గ్రామంలో సిమెంట్ కుర్చీల ఏర్పాటు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 05:43 PM

మాజీ సర్పంచ్ గంగప్ప మృతి -నివాళులు అర్పించిన మాజీ మంత్రి

మాజీ సర్పంచ్ గంగప్ప మృతి -నివాళులు అర్పించిన మాజీ మంత్రి

మాజీ సర్పంచ్ గంగప్ప మృతి -నివాళులు అర్పించిన మాజీ మంత్రి
May 09, 2026 12:44 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కోగిర గ్రామ మాజీ సర్పంచ్ గంగప్ప అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే గ్రామ ప్రజలు, మిత్రులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో వారి నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు.


ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కోగిర గ్రామానికి చేరుకున్నారు. గంగప్ప గారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.


అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. “గంగప్ప గ్రామ అభివృద్ధికి ఎంతో సేవ చేశారు, వారి సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి” అని పేర్కొన్నారు.


గ్రామంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని గంగప్ప గారికి చివరి వీడ్కోలు పలికారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News