మాజీ మంత్రి హరీష్ రావు తో జీఎంఆర్ సభ్యుల సమావేశం
మాజీ మంత్రి హరీష్ రావు తో జీఎంఆర్ సభ్యుల సమావేశం
Krishna
హైదరాబాద్ పట్టణంలో మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు వద్ద నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి జీఎంఆర్ తరపన గెలుపొందిన నూతన సర్పంచులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మరియు బిఆర్ఎస్ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ పాల్గొన్నారు.సభలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఆత్మకమిటీ డైరెక్టర్ అనుమల మారుతి, నూతన సర్పంచులు రానాపూర్ సర్పంచ్ ఎంబడి సంగారెడ్డి, సంగెం సర్పంచ్ ధర్మానాయక్, గౌడ్గమ్ సర్పంచ్ తనజీ పటేల్, ఎడ్ల రేగడి తండా సర్పంచ్ బలరాం నాయక్, సుకల్తిర్త్ సర్పంచ్ నీలేష్, రాసోల్ సర్పంచ్ యేసు, రేకే నాయక్ తండ సర్పంచ్ శంకర్, కిషన్ నాయక్ తండ సర్పంచ్ సంజు, దామరగిద్ద ఉప సర్పంచ్ సుభాష్, జిరిగి తండ ఉప సర్పంచ్ సురేష్, జిరిగి తండ మాజీ ఎంపీటీసీ కిరణ్, దామరగిద్ద మాజీ సర్పంచ్ శంకర్ సాగర్, సీతారాం తండా మాజీ సర్పంచ్ రాజు నాయక్, మాజీ సర్పంచ్ పుండ్లిక్, రాసోల్ మాజీ సర్పంచ్ సాయిలు, సుకల్తెర్త్ మాజీ సర్పంచ్ విజయ్ పటేల్ పాల్గొన్నారు.
అలాగే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బసవరాజ్ పటేల్, బీమ్రా బస్వరాజు పటేల్, గుఱ్ఱపు జ్ఞానేశ్వర్, బోరంచ సంగారెడ్డి, మోట్లకుంట నర్సింలు, బెల్లాపూర్ బసవరాజ్ పటేల్, గాంధీనగర్ హనుమాన్లు, హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు ప్రహ్లాద్, శ్రీకాంత్, మోహన్, సందీప్, రాజు, వాసు, సుధాకర్ మరియు యువత ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.సభలో ప్రధానంగా గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యలు, పథకాల అమలు మరియు యువత శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి.ప్రతి ప్రాంతంలోని సర్పంచులు, నాయకులు తమ అనుభవాలను పంచుకొని భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా సేవలు అందించడానికి నిర్ణయించుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి