PRINT TIME: July 11, 2026 02:36 AM
మాజీ డిఎస్పీ నళిని పి సన్మానించిన బి ఆర్ ఎస్ నాయకులు
మాజీ డిఎస్పీ నళిని పి సన్మానించిన బి ఆర్ ఎస్ నాయకులు
June 02, 2026 09:17 PM
41 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్న భువనగిరి కి చెందిన దోమకొండ నళిని ని మంగళవారం భువనగిరి బి ఆర్ ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ వి యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిర్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మహిళా నాయకురాలిగా ముందుండి పోరాటం చేసిన నళిని కి ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. నళిని కి రావాల్సిన ఉద్యోగ బెనిఫిట్స్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి
బి ఆర్ ఎస్ నాయకులు గుజ్జ పవన్, రాళ్ళబండి వనజ వెంకటాచారి, మార్గం సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి