హయత్నగర్: మండలంలోని లక్ష్మారెడ్డిపాలెం మైత్రి కుటీర్ గేటెడ్ కమ్యూనిటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు ఎడ్ల నరేందర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాలనీ సెక్రటరీ సుద్దాల ఎల్లయ్య, కోశాధికారి విన్నకోట రామ్మోహన్రావు, ఉపాధ్యక్షుడు వీరెల్లి వీరప్రసాద్, కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి