మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో నేమ్ ప్లేట్ మార్పు చేయాలి
మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో నేమ్ ప్లేట్ మార్పు చేయాలి
స్థానికం బృందం
ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖకు వినతి
మిర్యాలగూడ (స్థానిక ప్రతినిధి):
మిర్యాలగూడ రైల్వే స్టేషన్కు చేరుకునే రైలు ప్రయాణికులు, ముఖ్యంగా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వారు స్టేషన్ పేరు స్పష్టంగా కనిపించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో స్టేషన్లో ఏర్పాటు చేసిన నేమ్ ప్లేట్లను ఆధునికంగా, పెద్ద అక్షరాలతో, స్పష్టంగా కనిపించే విధంగా మార్చి కొత్తగా ఏర్పాటు చేయాలని రైల్వే డిపార్ట్మెంట్ను స్థానికులు కోరుతున్నారు.
ప్రస్తుతం ఉన్న బోర్డులు కొన్నిచోట్ల మసకబారిపోవడం, అక్షరాలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల రాత్రి సమయాల్లోనే కాకుండా పగటి వేళల్లో కూడా ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, తొలిసారి మిర్యాలగూడకు వచ్చే ప్రయాణికులు స్టేషన్ గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోతున్నారు.
కావున రైల్వే అధికారులు స్పందించి, మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పేరు అన్ని ప్లాట్ఫారమ్లలో, ప్రవేశ ద్వారాల వద్ద, రైళ్లు నిలిచే ప్రాంతాల్లో పెద్ద అక్షరాలతో, తెలుగు–ఇంగ్లీష్ భాషల్లో స్పష్టంగా కనిపించేలా నేమ్ ప్లేట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ప్రయాణికుల సౌకర్యానికి ఎంతో దోహదపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి