మైనారిటీ కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మానం
మైనారిటీ కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మానం
Biksham
వైస్ చైర్మన్ షఫీ ఉల్లా సహా పలువురికి ఘన గౌరవం
పట్టణానికి చెందిన మైనారిటీ సీనియర్ జర్నలిస్టులు మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా మరియు పలువురు నూతనంగా ఎన్నుకోబడిన వార్డు కౌన్సిలర్లను ఆత్మీయంగా సన్మానించారు. ఎలాంటి భారీ సభలు నిర్వహించకుండా, సాదాసీదా వాతావరణంలో పరస్పర గౌరవంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ షఫీ ఉల్లాకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు. అలాగే 2వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ తన్వీర్ హుస్సేన్, 16వ వార్డు కౌన్సిలర్ షేక్ జహీర్, 34వ వార్డు కౌన్సిలర్ తాహెర్ బిన్ మన్సూర్, 36వ వార్డు కౌన్సిలర్ షేక్ మన్సూర్ బి (ఫారుక్)లను కూడా సన్మానించారు. మైనారిటీ సీనియర్ జర్నలిస్టులు జహంగీర్, రషీద్, ఎస్కే పాషా, జహీర్, నజీర్ ఖాన్ తదితరులు మాట్లాడుతూ మైనారిటీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రజాప్రతినిధులను అభినందించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యత అయితే, ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులను ప్రోత్సహించడం కూడా తమ కర్తవ్యమేనని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి