మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం
మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం
Editor Desk
ఆదోని: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహిస్తున్న “తాలీమ్-ఎ-హునర్ టాలెంట్ టెస్ట్”కు హాజరవుతున్న మైనారిటీ విద్యార్థుల కోసం ఆదోని నియోజకవర్గం నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
ఆదోని టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కె. మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకుడు కె. ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో 150 మంది ముస్లిం విద్యార్థులు, విద్యార్థినులకు బస్సులు, భోజన వసతులు కల్పించారు.
ఈ సందర్భంగా యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు మైనారిటీ నాయకులతో కలిసి విద్యార్థులకు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల విద్యా పురోగతి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు కె.యం.డి. అల్తాఫ్ హుస్సేన్, కర్నూలు పార్లమెంట్ టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అప్సర్ భాషతో పాటు పలువురు మైనారిటీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి