మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట
మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఏఐసీసీ సభ్యుడు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.వారు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మైనార్టీలు, పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పోతు భాస్కర్, పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి