మహిళలు ఎంటర్ ప్రెన్యూర్స్ గా రాణించేందుకు కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేస్తాము : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్
మహిళలు ఎంటర్ ప్రెన్యూర్స్ గా రాణించేందుకు కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేస్తాము : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్
GADDAM JAGANMOHAN REDDY
విజయవాడ ఎన్.ఐ.ఆర్.డి లో శిక్షణ పొందిన మహిళలతో ఎంపీ సమావేశం
ఈ సమావేశానికి హ్యాండ్ మేడ్ పేపర్ ప్రొడక్ట్స్, హోమ్ బేస్ట్ ప్రొడక్ట్స్ , బ్రిక్స్ తయారీ పై శిక్షణ పొందిన మహిళలు హాజరు
విజయవాడ : కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో స్వయం ఉపాధికి సంబంధించి నైపుణ్యాభివృద్ది శిక్షణ పొందిన మహిళలు ఎంటర్ ప్రెన్యూర్స్ గా రాణించేందుకు కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేయటంతోపాటు మార్కెటింగ్ పరంగా కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్ హ్యాండ్ మేడ్ పేపర్ ప్రొడక్ట్స్, హోమ్ బేస్ట్ ప్రొడక్ట్స్ , బ్రిక్స్ తయారీ పై శిక్షణ పొందిన మూడు గ్రూపుల మహిళలతో గ్రూపుల వారీ గా విడివిడిగా సమావేశం అయ్యారు. మహిళలు తాము తయారు చేసిన వస్తువులను ఎంపీ కేశినేని శివనాథ్ కి చూపించారు. ఆ వస్తువుల నాణ్యత, భద్రత ల కోసం తీసుకున్న జాగ్రత్తల గురించి ఎంపీ కేశినేని శివనాథ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా శిక్షణ పొందిన మహిళలు తమకి రా మెటీరియల్ కొనుగోలు విషయంలో, మార్కెటింగ్ పరంగా, మెషినరీ కి సంబంధించి సహకారం అందించాలని ఎంపీ కేశినేని శివనాథ్ ను కోరారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ శిక్షణ పొంది వస్తువులు తయారు చేస్తున్న మహిళలకు మరింతగా ప్రోత్సహకం అందించే విధంగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. . ఒకే రకమైన వస్తువులు తయారు చేసే వారందరికీ ఉపయోగపడే విధంగా కామన్ పెసిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ను ఏర్పాటు చేయటానికి వేగవంతంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అలాగే తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కల్పించే విధంగా..వారు ఆర్థికంగా మరింత ఉన్నత స్థానంలో వుండే విధంగా కావాల్సిన సదుపాయాలు కల్పించటంతో పాటు , ఎటువంటి సహాయ సహకారాలు అందించటానికైనా ముందు వుంటామని తెలిపారు. ఇంటి ఒక ఎంటర్ ప్రెన్యూర్ వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాన్ని స్పూర్తిగా తీసుకుని మహిళలను ఎంటర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దేందుకు కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎన్.ఐ.ఆర్.డి లో పలు విభాగాల్లో శిక్షణ ఇప్పించటం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్.ఐ.ఆర్.డి అధికారి మురళీకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూరల్ కో ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ, న్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బన్ కో ఆర్డినేటర్ వల్లభనేని నరసింహాచౌదరి, ఎన్టీఆర్ జిల్లా సమైక్య
అధ్యక్షురాలు కందుల కల్పన, ప్రధాన కార్యదర్శి రామలక్ష్మీ, విజయవాడ రూరల్ సమైక్య అధ్యక్షురాలు సుహాసిని, సెక్రటరీ విజయలక్ష్మీ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి