Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:17 AM

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి-చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి-చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి-చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
March 11, 2026 06:15 PM 234 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కుట్టు, ఎంబ్రాయిడరీ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చౌటుప్పల్ పురపాలిక చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కల్పన కోసం టైలరింగ్, ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందిన మహిళలకు బుధవారం లయన్స్ క్లబ్ భవనంలో ఆమె చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ అధ్యక్షుడు తిరందాసు జగన్నాథం అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొగుదాల పావని మాట్లాడుతూ మహిళల్లో అపారమైన శక్తి సామర్థ్యాలు దాగి ఉంటాయని తెలిపారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి ఏర్పరుచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.రామానంద తీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలకు అందజేసిన సర్టిఫికెట్ల ద్వారా బ్యాంకుల నుంచి రుణ సదుపాయం పొందుతూ స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. తమ సంస్థలో నైపుణ్యాన్ని పెంచుకునేందుకు మరింత శిక్షణను ఉచితంగా అందిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పోలోజు శ్రీనివాసాచారి, ట్రస్ట్ సెక్రటరీ మొగుదాల రమేష్, సేవా సెక్రటరీ అతహర్ పాష, ట్రెజరర్ సిలివేరు మంగయ్య, సభ్యులు ఉప్పు ఆంజనేయులు, నాంపల్లి రమేష్, కొసనం రామ్ రెడ్డి, బత్తిని రఘు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News