Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:03 PM

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి-చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి-చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి-చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
March 11, 2026 06:15 PM 231 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కుట్టు, ఎంబ్రాయిడరీ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చౌటుప్పల్ పురపాలిక చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కల్పన కోసం టైలరింగ్, ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందిన మహిళలకు బుధవారం లయన్స్ క్లబ్ భవనంలో ఆమె చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ అధ్యక్షుడు తిరందాసు జగన్నాథం అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొగుదాల పావని మాట్లాడుతూ మహిళల్లో అపారమైన శక్తి సామర్థ్యాలు దాగి ఉంటాయని తెలిపారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి ఏర్పరుచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.రామానంద తీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలకు అందజేసిన సర్టిఫికెట్ల ద్వారా బ్యాంకుల నుంచి రుణ సదుపాయం పొందుతూ స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. తమ సంస్థలో నైపుణ్యాన్ని పెంచుకునేందుకు మరింత శిక్షణను ఉచితంగా అందిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పోలోజు శ్రీనివాసాచారి, ట్రస్ట్ సెక్రటరీ మొగుదాల రమేష్, సేవా సెక్రటరీ అతహర్ పాష, ట్రెజరర్ సిలివేరు మంగయ్య, సభ్యులు ఉప్పు ఆంజనేయులు, నాంపల్లి రమేష్, కొసనం రామ్ రెడ్డి, బత్తిని రఘు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News