మహిళలకు పెద్దపీట వేసే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం
మహిళలకు పెద్దపీట వేసే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం
Biksham
స్వయం ఉపాధి అవకాశాల పెంపుకు కట్టుబాటు అని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో రాయిని గూడెం వార్డుకు చెందిన 25 సంఘాలు ఎల్గూరి వినోదను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపు దిశగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వడ్డీలేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎన్నికైన ప్రతినిధులను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ ఎల్గూరి ఇంద్రవీరయ్య, సునీత, జ్యోతి, రేణుక, వనజ, రజిత, మనీ, యశోద, మన్నెమ్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి