Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:49 AM

మహిళల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత

మహిళల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత

మహిళల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత
09-03-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి/పెనుకొండ : మహిళల అభ్యున్నతే సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్‌. సవిత అన్నారు. పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

మహిళలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు మరియు సీఎం చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన ఎన్టీఆర్, విద్యా–ఉద్యోగాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి ఆర్థిక స్వావలంబన సాధించేలా చర్యలు తీసుకున్నారన్నారు.

దీపం పథకాల ద్వారా మహిళల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లారని, స్త్రీ విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఇంటిలో ఉన్న ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల్లో వారికి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. పెనుకొండ ప్రాంతంలో ఎక్కువ మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

భారీగా తరలొచ్చిన మహిళలు

పేనుకొండలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు నియోజకవర్గం నలుమూలల నుంచి నాలుగు వేల మందికి పైగా మహిళలు హాజరయ్యారు. వచ్చిన మహిళలకు మంత్రి సవిత చీరలు, గాజులతో పాటు పసుపు–కుంకుమలను పంపిణీ చేశారు.

అంతకుముందు తన తండ్రి ఎస్‌. రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బస్ షెల్టర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ర్యాలీగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకున్నారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాల స్టాళ్లను సందర్శించి మహిళలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, సతీష్ కుమార్, ఇతర అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Sthanikam

మహిళల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత

Article Image

శ్రీ సత్యసాయి/పెనుకొండ : మహిళల అభ్యున్నతే సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్‌. సవిత అన్నారు. పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

మహిళలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు మరియు సీఎం చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన ఎన్టీఆర్, విద్యా–ఉద్యోగాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి ఆర్థిక స్వావలంబన సాధించేలా చర్యలు తీసుకున్నారన్నారు.

దీపం పథకాల ద్వారా మహిళల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లారని, స్త్రీ విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఇంటిలో ఉన్న ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల్లో వారికి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. పెనుకొండ ప్రాంతంలో ఎక్కువ మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

భారీగా తరలొచ్చిన మహిళలు

పేనుకొండలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు నియోజకవర్గం నలుమూలల నుంచి నాలుగు వేల మందికి పైగా మహిళలు హాజరయ్యారు. వచ్చిన మహిళలకు మంత్రి సవిత చీరలు, గాజులతో పాటు పసుపు–కుంకుమలను పంపిణీ చేశారు.

అంతకుముందు తన తండ్రి ఎస్‌. రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బస్ షెల్టర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ర్యాలీగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకున్నారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాల స్టాళ్లను సందర్శించి మహిళలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, సతీష్ కుమార్, ఇతర అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News