Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:54 PM

మహిళల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత

మహిళల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత

మహిళల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత
March 09, 2026 08:58 PM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి/పెనుకొండ : మహిళల అభ్యున్నతే సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్‌. సవిత అన్నారు. పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

మహిళలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు మరియు సీఎం చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన ఎన్టీఆర్, విద్యా–ఉద్యోగాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి ఆర్థిక స్వావలంబన సాధించేలా చర్యలు తీసుకున్నారన్నారు.

దీపం పథకాల ద్వారా మహిళల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లారని, స్త్రీ విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఇంటిలో ఉన్న ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల్లో వారికి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. పెనుకొండ ప్రాంతంలో ఎక్కువ మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

భారీగా తరలొచ్చిన మహిళలు

పేనుకొండలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు నియోజకవర్గం నలుమూలల నుంచి నాలుగు వేల మందికి పైగా మహిళలు హాజరయ్యారు. వచ్చిన మహిళలకు మంత్రి సవిత చీరలు, గాజులతో పాటు పసుపు–కుంకుమలను పంపిణీ చేశారు.

అంతకుముందు తన తండ్రి ఎస్‌. రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బస్ షెల్టర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ర్యాలీగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకున్నారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాల స్టాళ్లను సందర్శించి మహిళలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, సతీష్ కుమార్, ఇతర అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News