Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:45 AM

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది
March 12, 2026 10:12 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఘనంగా ఆక్షన్ఎయిడ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుక

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది అని డాక్టర్ వీణ ప్రోగ్రామ్ ఆఫీసర్ అండ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆక్షన్ఎయిడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వేడుక జరిగింది.ఈసందర్భంగా పలువురు మహిళా ఉద్యోగులు మరియు ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ లు మాట్లాడుతూ...సమాజంలో లింగ వివక్ష లేకుండా అన్ని రంగాలలో సమాన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.సామాజిక,ఆర్థిక,రాజకీయ రంగాలలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదని అన్నారు.గ్రామీణ ప్రాంతం నుండి మొదలుకుంటే సేవా రంగంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు గా మహిళలే అధికంగా ఉన్నారని, అక్కడినుండి అత్యున్నత స్థాయికి ఎదగడానికి ప్రభుత్వాలు తగు పాలసీలు తీసుకురావాలని,ఇప్పటికే కొన్ని పాలసీలు ఉన్నపటికీ మరిన్ని నూతన విధానాలు తీసుకురావాలని అన్నారు.ఈ సందర్భంగా మహిళా చదువు కోసం కృషి చేసిన సావిత్రీబాయి ఫూలే పోరాటాన్ని మరువలేని అన్నారు.ఈ కార్యక్రమానికి ఆక్షన్ఎయిడ్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ సురుపంగ శివలింగం అధ్యక్షత వహించగా హాస్టల్ వెల్ఫర్ అధికారులు సోనీ,రాజాలు బాయి,ఇందిరా,విజయశాంతి, కృష్ణవేణి,డిఆర్డిఏ నుండి రమణ,ఐసిడిఎస్ నుండి లలిత,అరుణ,రుక్మిణి,రాములమ్మ,పుష్ప,ఆశా వర్కర్లు పుష్ప,అనిత,ఆక్షన్ఎయిడ్ ఎల్ఆర్పి ప్రతినిధులు కవిత,శోభారాణి,చంద్రకళ,అనూష,శిరీష,మాధవి తదితరులు ప్రసంగించగా సుమారు డెబ్బై మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News