Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:44 PM

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది
March 12, 2026 10:12 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఘనంగా ఆక్షన్ఎయిడ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుక

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది అని డాక్టర్ వీణ ప్రోగ్రామ్ ఆఫీసర్ అండ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆక్షన్ఎయిడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వేడుక జరిగింది.ఈసందర్భంగా పలువురు మహిళా ఉద్యోగులు మరియు ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ లు మాట్లాడుతూ...సమాజంలో లింగ వివక్ష లేకుండా అన్ని రంగాలలో సమాన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.సామాజిక,ఆర్థిక,రాజకీయ రంగాలలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదని అన్నారు.గ్రామీణ ప్రాంతం నుండి మొదలుకుంటే సేవా రంగంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు గా మహిళలే అధికంగా ఉన్నారని, అక్కడినుండి అత్యున్నత స్థాయికి ఎదగడానికి ప్రభుత్వాలు తగు పాలసీలు తీసుకురావాలని,ఇప్పటికే కొన్ని పాలసీలు ఉన్నపటికీ మరిన్ని నూతన విధానాలు తీసుకురావాలని అన్నారు.ఈ సందర్భంగా మహిళా చదువు కోసం కృషి చేసిన సావిత్రీబాయి ఫూలే పోరాటాన్ని మరువలేని అన్నారు.ఈ కార్యక్రమానికి ఆక్షన్ఎయిడ్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ సురుపంగ శివలింగం అధ్యక్షత వహించగా హాస్టల్ వెల్ఫర్ అధికారులు సోనీ,రాజాలు బాయి,ఇందిరా,విజయశాంతి, కృష్ణవేణి,డిఆర్డిఏ నుండి రమణ,ఐసిడిఎస్ నుండి లలిత,అరుణ,రుక్మిణి,రాములమ్మ,పుష్ప,ఆశా వర్కర్లు పుష్ప,అనిత,ఆక్షన్ఎయిడ్ ఎల్ఆర్పి ప్రతినిధులు కవిత,శోభారాణి,చంద్రకళ,అనూష,శిరీష,మాధవి తదితరులు ప్రసంగించగా సుమారు డెబ్బై మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News