Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 01:43 AM

మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: న్యాల్కల్‌లో మహిళా కాంగ్రెస్ పోస్టుకార్డుల ఉద్యమం

మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: న్యాల్కల్‌లో మహిళా కాంగ్రెస్ పోస్టుకార్డుల ఉద్యమం

మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: న్యాల్కల్‌లో మహిళా కాంగ్రెస్ పోస్టుకార్డుల ఉద్యమం
May 14, 2026 08:58 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్, మహిళలకు రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాల్కల్ మండలం మీర్జాపూర్-బి గ్రామ పోస్టాఫీసు వద్ద మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోస్టుకార్డుల ద్వారా తమ డిమాండ్లను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ మహిళలు కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా, దేశ విధానాలను నిర్ణయించే స్థాయిలో కూడా భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న మహిళలకు కూడా ఉన్నత నిర్ణయాధికార పదవుల్లో సముచిత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.దేశ జనాభాలో సగభాగం మహిళలేనని, వారికి రాజకీయాల్లో తగిన స్థానం కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్ చట్టంలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. రానున్న జూలై నెల పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకురావాలని పోస్టుకార్డుల ద్వారా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.మహిళా కాంగ్రెస్ న్యాల్కల్ మండల నాయకురాలు స్వరూప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి స్నేహ, జహీరాబాద్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ కార్యదర్శి సురేఖ, మహిళా నాయకులు వహీదా బేగం, రేణుక, స్వప్న, అంబికా, కరిష్మా, గంగామణి, లలిత, మాధవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News