మహిళా ప్రజాప్రతినిధుల పట్ల చిన్నచూపు తగదు. ఎమ్మెల్యే, అధికార యంత్రాంగంపై సర్పంచ్ మమతారెడ్డి ఆగ్రహం
మహిళా ప్రజాప్రతినిధుల పట్ల చిన్నచూపు తగదు. ఎమ్మెల్యే, అధికార యంత్రాంగంపై సర్పంచ్ మమతారెడ్డి ఆగ్రహం
Editor Desk
భువనగిరి, :
మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఎమ్మెల్యేలు, జిల్లా అధికార యంత్రాంగం చిన్నచూపుతో వ్యవహరించడం తగదని టేకుల సోమవారం గ్రామ సర్పంచ్ పడమటి మమతారెడ్డి హెచ్చరించారు.
శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఆహ్వానం మేరకు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు పురుషులతో సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇకముందు మహిళా ప్రజాప్రతినిధులను అవమానించే పరిస్థితులను సహించబోమని స్పష్టం చేశారు.
మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, 33 శాతం రిజర్వేషన్లతో ప్రజల చేత ఎన్నుకోబడిన మహిళా ప్రజాప్రతినిధులకు పరిపాలనా అవకాశాలు వచ్చినప్పుడు అధికార యంత్రాంగం చిన్నచూపుతో వ్యవహరించడం బాధాకరమని ఆరోపించారు.
ఇకపై ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని ఆమె గుర్తు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి