Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:58 AM

మహిళా ప్రజాప్రతినిధుల పట్ల చిన్నచూపు తగదు. ఎమ్మెల్యే, అధికార యంత్రాంగంపై సర్పంచ్ మమతారెడ్డి ఆగ్రహం

మహిళా ప్రజాప్రతినిధుల పట్ల చిన్నచూపు తగదు. ఎమ్మెల్యే, అధికార యంత్రాంగంపై సర్పంచ్ మమతారెడ్డి ఆగ్రహం

మహిళా ప్రజాప్రతినిధుల పట్ల చిన్నచూపు తగదు.  ఎమ్మెల్యే, అధికార యంత్రాంగంపై సర్పంచ్ మమతారెడ్డి ఆగ్రహం
22-05-2026 315 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, :

మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఎమ్మెల్యేలు, జిల్లా అధికార యంత్రాంగం చిన్నచూపుతో వ్యవహరించడం తగదని టేకుల సోమవారం గ్రామ సర్పంచ్ పడమటి మమతారెడ్డి హెచ్చరించారు.

శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఆహ్వానం మేరకు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు పురుషులతో సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇకముందు మహిళా ప్రజాప్రతినిధులను అవమానించే పరిస్థితులను సహించబోమని స్పష్టం చేశారు.

మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, 33 శాతం రిజర్వేషన్లతో ప్రజల చేత ఎన్నుకోబడిన మహిళా ప్రజాప్రతినిధులకు పరిపాలనా అవకాశాలు వచ్చినప్పుడు అధికార యంత్రాంగం చిన్నచూపుతో వ్యవహరించడం బాధాకరమని ఆరోపించారు.

ఇకపై ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని ఆమె గుర్తు చేశారు.

Sthanikam

మహిళా ప్రజాప్రతినిధుల పట్ల చిన్నచూపు తగదు. ఎమ్మెల్యే, అధికార యంత్రాంగంపై సర్పంచ్ మమతారెడ్డి ఆగ్రహం

Article Image

భువనగిరి, :

మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఎమ్మెల్యేలు, జిల్లా అధికార యంత్రాంగం చిన్నచూపుతో వ్యవహరించడం తగదని టేకుల సోమవారం గ్రామ సర్పంచ్ పడమటి మమతారెడ్డి హెచ్చరించారు.

శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఆహ్వానం మేరకు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు పురుషులతో సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇకముందు మహిళా ప్రజాప్రతినిధులను అవమానించే పరిస్థితులను సహించబోమని స్పష్టం చేశారు.

మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, 33 శాతం రిజర్వేషన్లతో ప్రజల చేత ఎన్నుకోబడిన మహిళా ప్రజాప్రతినిధులకు పరిపాలనా అవకాశాలు వచ్చినప్పుడు అధికార యంత్రాంగం చిన్నచూపుతో వ్యవహరించడం బాధాకరమని ఆరోపించారు.

ఇకపై ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని ఆమె గుర్తు చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News