Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

మహిళా హక్కుల కోసం ఉద్యమించాలి టి.అరుణ

మహిళా హక్కుల కోసం ఉద్యమించాలి టి.అరుణ

మహిళా హక్కుల కోసం ఉద్యమించాలి టి.అరుణ
March 09, 2026 09:48 AM 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి దుర్గం పూజిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరికల కళావతి, ఏఐసిటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టి.అరుణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.హరినాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా టి.అరుణ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కేవలం వేడుకగా కాకుండా పురుషాధిక్య భావజాలానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నప్పటికీ మహిళల సాధికారతలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, మహిళల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వాలు బాధ్యత వహించడం లేదన్నారు.

ముగ్గురు పిల్లలను కనాలని సూచించే పాలకులు ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా జీవనోపాధి పథకాలు రూపొందించాలని కోరారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.

ఇటీవల మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నాయని, ఆయేషామేర ఘటనలో నిందితులను పట్టుకోకపోవడం బాధాకరమని దుర్గం పూజిత అన్నారు. నిర్భయ, దిశ చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై హింసను అరికట్టడంలో విఫలమవుతున్నాయని పరికల కళావతి ఆరోపించారు.

మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డి.హరినాథ్ డిమాండ్ చేశారు. సంఘటనల సమయంలో బాధితులకు న్యాయం చేయకుండా నిందితుల పక్షాన నిలబడటం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని దుర్గం పుల్లారావు విమర్శించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు, కార్యకర్తలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News