Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:54 AM

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా కమిటీ ఏర్పాటు

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా కమిటీ ఏర్పాటు

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా కమిటీ ఏర్పాటు
April 08, 2026 08:24 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి:ఈ నెల 11న జరగబోయే మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా భువనగిరి పట్టణంలోని చాళుక్య రాఘవేంద్ర హోటల్‌లో అన్ని రాజకీయ పార్టీల, కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జయంతి ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. జయంతి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షురాలిగా భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్‌ను నియమించారు. గౌరవ సలహాదారులుగా పొత్నక్ ప్రమోద్ కుమార్,అతికం లక్ష్మి నారాయణ గౌడ్,పెంట నరసింహ,సుర్వీ శ్రీనివాస్ గౌడ్,గొట్టిపముల బాబురావు, మాటూరి అశోక్,కొత్త బాలరాజు,మాటూరి బాలేశ్వర్‌ను ఎంపిక చేశారు. కన్వీనర్‌గా కొత్త నరసింహ స్వామిని నియమించారు.కో-కన్వీనర్లుగా దేవరకొండ నర్సింహ చారి,దరిపల్లి ప్రవీణ్ కుమార్,పంచేద్దుల బాల్ రామ్,పిట్టల బాలరాజు,సబంకర్ వెంకటేష్,బెండ శ్రీకాంత్, సిరికొండ శివకుమార్,యేషాల అశోక్,మాయ కృష్ణ,జిన్న మల్లేష్,కూర శివ కుమార్,రత్నపురం పద్మ,సిద్ధుల పద్మలను నియమించారు. ఈ సమావేశంలో అన్ని కుల సంఘాలు,అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో జరగబోయే ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా బీసీ ప్రతినిధులు,బీసీ కుల సంఘాల నాయకులు,బీసీ విద్యార్థులు,ఉద్యోగులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ బీసీ కులాలకు చెందిన నాయకులు,అన్ని రాజకీయ పార్టీల బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News