Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేటకు మళ్లీ పూర్వ వైభవం… నియోజకవర్గం ఏర్పాటు చేయాలి – పోతరాజు శంకరయ్య “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 10:56 PM

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా కమిటీ ఏర్పాటు

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా కమిటీ ఏర్పాటు

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా కమిటీ ఏర్పాటు
April 08, 2026 08:24 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి:ఈ నెల 11న జరగబోయే మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా భువనగిరి పట్టణంలోని చాళుక్య రాఘవేంద్ర హోటల్‌లో అన్ని రాజకీయ పార్టీల, కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జయంతి ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. జయంతి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షురాలిగా భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్‌ను నియమించారు. గౌరవ సలహాదారులుగా పొత్నక్ ప్రమోద్ కుమార్,అతికం లక్ష్మి నారాయణ గౌడ్,పెంట నరసింహ,సుర్వీ శ్రీనివాస్ గౌడ్,గొట్టిపముల బాబురావు, మాటూరి అశోక్,కొత్త బాలరాజు,మాటూరి బాలేశ్వర్‌ను ఎంపిక చేశారు. కన్వీనర్‌గా కొత్త నరసింహ స్వామిని నియమించారు.కో-కన్వీనర్లుగా దేవరకొండ నర్సింహ చారి,దరిపల్లి ప్రవీణ్ కుమార్,పంచేద్దుల బాల్ రామ్,పిట్టల బాలరాజు,సబంకర్ వెంకటేష్,బెండ శ్రీకాంత్, సిరికొండ శివకుమార్,యేషాల అశోక్,మాయ కృష్ణ,జిన్న మల్లేష్,కూర శివ కుమార్,రత్నపురం పద్మ,సిద్ధుల పద్మలను నియమించారు. ఈ సమావేశంలో అన్ని కుల సంఘాలు,అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో జరగబోయే ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా బీసీ ప్రతినిధులు,బీసీ కుల సంఘాల నాయకులు,బీసీ విద్యార్థులు,ఉద్యోగులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ బీసీ కులాలకు చెందిన నాయకులు,అన్ని రాజకీయ పార్టీల బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News