Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:43 PM

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహణ

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహణ

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహణ
April 11, 2026 12:54 PM 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సమానత్వం, విద్యా విస్తరణకు పూలే చూపిన మార్గం అనుసరించాలి – వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట: మహాత్మ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని సూర్యాపేట జిల్లా రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ కోసం చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. మహిళల విద్యాభివృద్ధి, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం సమాజానికి మార్గదర్శకమని అన్నారు.

పూలే ఆలోచనలు నేటికీ ప్రాసంగికంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. సమానత్వ సమాజ నిర్మాణానికి ఆయన చూపిన మార్గమే స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బంధారపు నర్సయ్య, కొంగుల ప్రవీణ్, బెల్లంకొండ నీరజ గౌడ్, లింగం యాదవ్, మామిడి అంజయ్య, మీర్ అక్బర్, కొన్నే మంజుల గౌడ్, కుంభం నాగరాజు, బొల్లె సైదులు, ఆవుల అంజయ్య, కుంభం వెంకన్న యాదవ్, బొమ్మగాని సైదులు, మురళి, చింతకాయల జానయ్య, సైదులు, మధు, మామిడి శోభన్ బాబు, వెంకటేశ్, రఘు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News