మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహణ
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహణ
Biksham
సమానత్వం, విద్యా విస్తరణకు పూలే చూపిన మార్గం అనుసరించాలి – వట్టే జానయ్య యాదవ్
సూర్యాపేట: మహాత్మ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని సూర్యాపేట జిల్లా రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ కోసం చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. మహిళల విద్యాభివృద్ధి, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం సమాజానికి మార్గదర్శకమని అన్నారు.
పూలే ఆలోచనలు నేటికీ ప్రాసంగికంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. సమానత్వ సమాజ నిర్మాణానికి ఆయన చూపిన మార్గమే స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బంధారపు నర్సయ్య, కొంగుల ప్రవీణ్, బెల్లంకొండ నీరజ గౌడ్, లింగం యాదవ్, మామిడి అంజయ్య, మీర్ అక్బర్, కొన్నే మంజుల గౌడ్, కుంభం నాగరాజు, బొల్లె సైదులు, ఆవుల అంజయ్య, కుంభం వెంకన్న యాదవ్, బొమ్మగాని సైదులు, మురళి, చింతకాయల జానయ్య, సైదులు, మధు, మామిడి శోభన్ బాబు, వెంకటేశ్, రఘు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి