Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:18 PM

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందాం

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందాం

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందాం
January 19, 2026 12:32 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పేదల హక్కులపై దాడిని తిప్పికొట్టాలి

ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిస్తే ఊరుకోం

కార్పొరేట్ ప్రయోజనాలకే కేంద్ర విధానాలు

ప్రజల ఉద్యమంతోనే హక్కుల రక్షణ

జాతాలో ములకలపల్లి రాములు పిలుపు

సూర్యాపేట

పేదల జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఇతర పథకాలను తీసుకురావడం పేదల వ్యతిరేక చర్యగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు విమర్శించారు. 2005లో యూపీఏ వన్ ప్రభుత్వ హయాంలో వామపక్ష పార్టీలు చేసిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఆదివారం సాయంత్రం మునగాల మండలంలో నిర్వహించిన జాతాకు ఘన స్వాగతం పలికిన అనంతరం ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ప్రజలందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రైతాంగం, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలు ప్రతిఘటించాలని అన్నారు. భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా రేపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ జాతాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నమ్మాది వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపల్లి సైదులు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, సిఐటియు మండల కన్వీనర్ బచ్చలకూరి స్వరాజ్యం, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేవర వెంకటరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జానయ్య, జిల్లా కమిటీ సభ్యుడు అరె రామకృష్ణారెడ్డి, మండల కమిటీ సభ్యుడు సరికొండ నాగరాజు, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం వినోద్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కిన్నెర వెంకన్న, గడ్డ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News