Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:27 AM

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు
February 08, 2026 12:40 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బి కే యం యు) రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జిరాంజీ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ చాట్రాయి మండలం చిన్నంపేటలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలతో కలిసి ఆయన విస్తృత ప్రసారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2005 లో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రద్దుచేసి గాంధీజీని హత్య చేసిన గాడ్సే పేరు వచ్చేలాగా వికసిత్ భారత్ జి రామ్ జి పథకాన్ని తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.జి రాం జి పథకం వల్ల గ్రామీణ పేదలకు ఉపాధి పనులు దక్కకుండా పోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం ఉంటే కేంద్రం 90 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నిధులు కేటాయించేయని, జీ రాం జీ పథకం ద్వారా కేంద్రం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు కేటాయించడం సాధ్యం కానీ పని అని తద్వారా ఉపాధి హామీని గ్రామీణ పేదలకు లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు సంయుక్తంగా ఉపాధి చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాలను గ్రామంలో ఇంటింటికి తిరిగి పేద ప్రజలకు ఇచ్చి విస్తృత ప్రచారాన్ని వ్యవసాయ కార్మికులు చేపట్టారు. ఫిబ్రవరి 9వ తేదీన మండల ఏ పీ ఓ కు వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి కొమ్ము ఆనంద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు తో పాటు వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సి పి ఐ నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ మరియు వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News