PRINT TIME: April 11, 2026 02:43 PM
మహాశివరాత్రి వేళ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అధిక ఆదాయం
మహాశివరాత్రి వేళ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అధిక ఆదాయం
February 17, 2026 05:49 PM
88 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
గత ఏడాదితో పోలిస్తే లక్షా నలభై నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయల పెరుగుదల
శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం: కూసుమంచి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా నమోదైంది. ఈ సందర్భంగా దేవస్థానానికి గణనీయమైన ఆదాయం లభించినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దేవస్థాన ఆదాయం ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు పెరిగినట్లు వెల్లడించారు. భక్తుల విరాళాలు, ప్రత్యేక దర్శనాలు, అర్చనలు, ప్రసాదాల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడగా, వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన పరిసరాలు శివనామస్మరణతో మార్మోగాయి.
ఇట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ, కూసుమంచి గ్రామం అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి