నకిరేకల్ నియోజకవర్గం
నార్కెట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న మహాశివరాత్రి పర్వదినోత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రికను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఆలయ ఈవో మెహన్ బాబు, స్థానిక సర్పంచ్ నేతగాని కృష్ణ,అర్చకులుమర్యాదపూర్వకంగా అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలనుభక్తిశ్రద్ధలతో,వైభవంగానిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలతీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఎమ్మెల్యే వేముల వీరేశం స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి