Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:45 AM

మహాశివరాత్రి రద్దీలో తప్పిపోయిన చిన్నారి… పోలీసుల అప్రమత్తతతో సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు సిఐ రామకృష్ణ

మహాశివరాత్రి రద్దీలో తప్పిపోయిన చిన్నారి… పోలీసుల అప్రమత్తతతో సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు సిఐ రామకృష్ణ

మహాశివరాత్రి రద్దీలో తప్పిపోయిన చిన్నారి… పోలీసుల అప్రమత్తతతో సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు సిఐ రామకృష్ణ
February 17, 2026 10:16 AM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మహా శివరాత్రి ఉత్సవాల సందడిలో వేలాది మంది భక్తులతో కళకళలాడుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. భక్తుల రద్దీ మధ్య తల్లిదండ్రుల నుండి వేరుపడిన ఒక చిన్నారిని నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ సమయోచితంగా స్పందించి సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు.

శివరాత్రి సందర్భంగా దర్శనానికి వచ్చిన ఆ చిన్నారి, అనుకోకుండా తల్లిదండ్రుల నుండి దూరమై అపరిచితుల మధ్య భయంతో ఏడుస్తూ కనిపించింది. పరిస్థితిని గమనించిన ఇన్‌స్పెక్టర్ వెంటనే స్పందించి చిన్నారిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అనంతరం క్షేత్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తరలించి, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా చిన్నారి వివరాలను ప్రకటింపజేశారు.

ప్రకటన విన్న తల్లిదండ్రులు ఆందోళనతో కంట్రోల్ రూమ్‌కు చేరుకుని, సరైన నిర్ధారణ అనంతరం చిన్నారిని తమ చెంతకు తీసుకున్నారు. తమ బిడ్డను సురక్షితంగా అందించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పోలీసులు భక్తులకు పలు జాగ్రత్తలు సూచించారు. రద్దీ ప్రదేశాల్లో పిల్లల చేతులు వదలకూడదని, పిల్లల జేబులో తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ ఉంచడం మంచిదని, ఎవరైనా పిల్లలు కనిపించకపోతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News