మహాశివరాత్రి జాతరకు ఎంపీకి ఆహ్వానం పిలుపు
మహాశివరాత్రి జాతరకు ఎంపీకి ఆహ్వానం పిలుపు
Krishna
బిచ్కుంద మఠం పీఠాధిపతి సోమయ్యప్ప మహారాజ్ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న జాతర కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్కు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా నారాయణాఖేడ్ నియోజకవర్గం, ఖేడ్ మున్సిపల్ పరిధిలోని జహీరాబాద్లో ఉన్న ఎంపీ స్వగృహంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ శెట్కార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శెట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బిచ్కుంద మఠంలో నిర్వహించనున్న జాతర కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరగనున్న నేపథ్యంలో ఈ ఆహ్వానం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ సందర్భంగా జగదీష్, మాణిక్ రావు పటేల్, భాను గౌడ్, సాయి చరణ్, దత్తు రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత శోభాయమానంగా చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి