Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:16 AM

మహానేతకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మార్పీఎస్ నేతలు

మహానేతకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మార్పీఎస్ నేతలు

మహానేతకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మార్పీఎస్ నేతలు
April 05, 2026 06:44 PM 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు, మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బోయ రామచంద్రం మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ దేశ నిర్మాణంలో విశేష సేవలు అందించిన మహానేత అని కొనియాడారు.స్థానిక బస్టాండ్ వద్ద ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కడు పేదరిక దళిత కుటుంబం నుంచి ఎదిగిన జగ్జీవన్ రామ్ భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించి, డా. అంబేద్కర్‌కు అండగా నిలిచారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా అనేక శాఖల్లో పనిచేసి పలు చట్టాలకు రూపకర్తగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు.అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రాజకీయ కుట్రల కారణంగా ప్రధాని పదవి దూరమైన దళిత నాయకుడని వ్యాఖ్యానించారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికీ కోట్లాది ప్రజలకు ఉపయోగపడుతున్నాయని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మేడి యాదయ్య, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాము, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చింతల సాయిలు, సుక్క సుదర్శన్, సామాజిక ఉద్యమకారుడు కట్టెల లింగస్వామి, మాజీ మండల అధ్యక్షులు దొనకొండ కృష్ణ, నాయకులు బద్రి గాలయ్య, బోయ సృజన్, ముత్యాల గణేష్, దొనకొండ కిరణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News