మహానేతకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మార్పీఎస్ నేతలు
మహానేతకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మార్పీఎస్ నేతలు
K.RAVI
భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు, మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బోయ రామచంద్రం మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ దేశ నిర్మాణంలో విశేష సేవలు అందించిన మహానేత అని కొనియాడారు.స్థానిక బస్టాండ్ వద్ద ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కడు పేదరిక దళిత కుటుంబం నుంచి ఎదిగిన జగ్జీవన్ రామ్ భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించి, డా. అంబేద్కర్కు అండగా నిలిచారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా అనేక శాఖల్లో పనిచేసి పలు చట్టాలకు రూపకర్తగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు.అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రాజకీయ కుట్రల కారణంగా ప్రధాని పదవి దూరమైన దళిత నాయకుడని వ్యాఖ్యానించారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికీ కోట్లాది ప్రజలకు ఉపయోగపడుతున్నాయని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మేడి యాదయ్య, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాము, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చింతల సాయిలు, సుక్క సుదర్శన్, సామాజిక ఉద్యమకారుడు కట్టెల లింగస్వామి, మాజీ మండల అధ్యక్షులు దొనకొండ కృష్ణ, నాయకులు బద్రి గాలయ్య, బోయ సృజన్, ముత్యాల గణేష్, దొనకొండ కిరణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి