మహాలక్ష్మి పథకం మహిళలకు వరం లాంటిది : మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి
మహాలక్ష్మి పథకం మహిళలకు వరం లాంటిది : మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి
Prabhakar
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపో ఈ సి ఐ ఎల్ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన మహాలక్ష్మి ప్రయాణ పథకం లో భాగంగా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్ర సామాజిక, ఆర్థిక ముఖచిత్రంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల రవాణా ఛార్జీల మొత్తం నేటితో రూ. 10,000 కోట్ల మార్కును చేరుకుందని .
కుషాయిగూడ డిపో మేనేజర్ వేణుగోపాల్ మాట్లాడుతూ
గతంలో రవాణా ఛార్జీల కోసం నెలకు సగటున రూ. 1,500 నుండి రూ. 2,500 వరకు వెచ్చించే సామాన్య, మధ్యతరగతి మహిళలు, విద్యార్థినులు, కూలీలు ఇప్పుడు ఆ మొత్తాన్ని పొదుపు చేసుకుంటున్నారని, ఈ పొదుపు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా రూ. 10,000 కోట్లకు చేరడం మహిళల ఆర్థిక స్వావలంబనకు నిదర్శనంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
మాజీ కార్పొరేటర్ బొంత శ్రీదేవి మాట్లాడుతూ
మహాలక్ష్మి అమలు తరువాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని, పథకం రాకముందు 40 శాతంగా ఉన్న మహిళల వాటా, ప్రస్తుతం 67 శాతానికి పైగా నమోదవుతోందని, ప్రతిరోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నట్లు ఎండీ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి కుషాయిగూడ డిపో అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి ఎంఎఫ్ ఎన్ కీర్తి కుమార్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య రాజేష్ నాయుడు వెల్ ఫర్ మెంబర్ రాములు , మహేందర్ రెడ్డి ఎస్బిఐ భగవంతుం డ్రైవర్ ఉపేందర్ కండక్టర్ బాబు ఉద్యోగులు పాల్గొనడం జరిగింది

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి