Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:25 PM

మహాలక్ష్మి పథకం మహిళలకు వరం లాంటిది : మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి

మహాలక్ష్మి పథకం మహిళలకు వరం లాంటిది : మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి

మహాలక్ష్మి పథకం మహిళలకు వరం లాంటిది : మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి
March 31, 2026 09:04 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపో ఈ సి ఐ ఎల్ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన మహాలక్ష్మి ప్రయాణ పథకం లో భాగంగా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్ర సామాజిక, ఆర్థిక ముఖచిత్రంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల రవాణా ఛార్జీల మొత్తం నేటితో రూ. 10,000 కోట్ల మార్కును చేరుకుందని .

కుషాయిగూడ డిపో మేనేజర్ వేణుగోపాల్ మాట్లాడుతూ

గతంలో రవాణా ఛార్జీల కోసం నెలకు సగటున రూ. 1,500 నుండి రూ. 2,500 వరకు వెచ్చించే సామాన్య, మధ్యతరగతి మహిళలు, విద్యార్థినులు, కూలీలు ఇప్పుడు ఆ మొత్తాన్ని పొదుపు చేసుకుంటున్నారని, ఈ పొదుపు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా రూ. 10,000 కోట్లకు చేరడం మహిళల ఆర్థిక స్వావలంబనకు నిదర్శనంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

మాజీ కార్పొరేటర్ బొంత శ్రీదేవి మాట్లాడుతూ

మహాలక్ష్మి అమలు తరువాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని, పథకం రాకముందు 40 శాతంగా ఉన్న మహిళల వాటా, ప్రస్తుతం 67 శాతానికి పైగా నమోదవుతోందని, ప్రతిరోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నట్లు ఎండీ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి కుషాయిగూడ డిపో అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి ఎంఎఫ్ ఎన్ కీర్తి కుమార్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య రాజేష్ నాయుడు వెల్ ఫర్ మెంబర్ రాములు , మహేందర్ రెడ్డి ఎస్బిఐ భగవంతుం డ్రైవర్ ఉపేందర్ కండక్టర్ బాబు ఉద్యోగులు పాల్గొనడం జరిగింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News