Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత వెంకటేశం గౌడ్ బర్త్‌డే వేడుకలు చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 31, 2026 11:01 PM

మహాలక్ష్మి పథకానికి మహా విజయోత్సవం

మహాలక్ష్మి పథకానికి మహా విజయోత్సవం

మహాలక్ష్మి పథకానికి మహా విజయోత్సవం
March 31, 2026 09:03 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో మహిళల ఆదా రూ.10,012 కోట్లు దాటింది

భువనగిరిలో ఘనంగా విజయోత్సవ సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి బస్ స్టాండ్‌లో మహాలక్ష్మి పథకం విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం అందించిన ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆదా చేసిన ప్రయాణ ఖర్చు రూ.10,012 కోట్లు దాటిన సందర్భంగా ఈ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్ రావు, భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పొతంశెట్టి మంజుల వెంకటేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహ్మద్ అవైస్ చిస్తీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి, ఆర్‌డీఓ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ “మహిళల స్వేచ్ఛా ప్రయాణం తెలంగాణకు గర్వకారణం” అని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో అందించే ఉచిత సేవలను కూడా మహిళలు వినియోగించుకోవాలని సూచించారు.జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారత దిశగా ప్రతి మండల మహిళా సమాఖ్యకు ఒక బస్సు కొనుగోలు చేయడానికి అనుమతులు లభించాయని తెలిపారు. ఆ బస్సులను ఆర్టీసీ కు అద్దెకు ఇస్తే నెలకు రూ.69,500 చొప్పున సమాఖ్య ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. జిల్లాలో మహిళలకు రూ.611 కోట్ల రుణ లక్ష్యానికి గాను రూ.632 కోట్ల రుణాలు మంజూరు చేయగా, 99 శాతం రుణాలు సకాలంలో చెల్లిస్తున్నారని వివరించారు.ఆర్‌డీఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఉచిత ప్రయాణం ద్వారా ఆదా అయ్యే మొత్తాన్ని పొదుపుగా నిల్వచేసుకొని భవిష్యత్తులో ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ కొండల్ రావు, ఆర్‌టీసీ డీఎం సి.హెచ్ మురళీకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, కార్యదర్శి పల్లవి, కోశాధికారి అలివేలు, అదనపు డీఆర్‌డీఓ కోట జంగారెడ్డి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News