Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:52 PM

మహాలక్ష్మి పథకానికి మహా విజయోత్సవం

మహాలక్ష్మి పథకానికి మహా విజయోత్సవం

మహాలక్ష్మి పథకానికి మహా విజయోత్సవం
March 31, 2026 09:03 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో మహిళల ఆదా రూ.10,012 కోట్లు దాటింది

భువనగిరిలో ఘనంగా విజయోత్సవ సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి బస్ స్టాండ్‌లో మహాలక్ష్మి పథకం విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం అందించిన ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆదా చేసిన ప్రయాణ ఖర్చు రూ.10,012 కోట్లు దాటిన సందర్భంగా ఈ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్ రావు, భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పొతంశెట్టి మంజుల వెంకటేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహ్మద్ అవైస్ చిస్తీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి, ఆర్‌డీఓ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ “మహిళల స్వేచ్ఛా ప్రయాణం తెలంగాణకు గర్వకారణం” అని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో అందించే ఉచిత సేవలను కూడా మహిళలు వినియోగించుకోవాలని సూచించారు.జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారత దిశగా ప్రతి మండల మహిళా సమాఖ్యకు ఒక బస్సు కొనుగోలు చేయడానికి అనుమతులు లభించాయని తెలిపారు. ఆ బస్సులను ఆర్టీసీ కు అద్దెకు ఇస్తే నెలకు రూ.69,500 చొప్పున సమాఖ్య ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. జిల్లాలో మహిళలకు రూ.611 కోట్ల రుణ లక్ష్యానికి గాను రూ.632 కోట్ల రుణాలు మంజూరు చేయగా, 99 శాతం రుణాలు సకాలంలో చెల్లిస్తున్నారని వివరించారు.ఆర్‌డీఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఉచిత ప్రయాణం ద్వారా ఆదా అయ్యే మొత్తాన్ని పొదుపుగా నిల్వచేసుకొని భవిష్యత్తులో ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ కొండల్ రావు, ఆర్‌టీసీ డీఎం సి.హెచ్ మురళీకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, కార్యదర్శి పల్లవి, కోశాధికారి అలివేలు, అదనపు డీఆర్‌డీఓ కోట జంగారెడ్డి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News