Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:22 PM

మహిళా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం

మహిళా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం

మహిళా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం
December 26, 2025 01:11 PM 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం

బోరంచలో ఘనంగా చీరల పంపిణీ

స్థానిక ప్రతినిధి నారాయణఖేడ్

నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలంలోని బోరంచ గ్రామంలో మహిళా సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీరల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవ్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం గ్రామస్థాయిలో సక్రమంగా కొనసాగింది. కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప నేతృత్వంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పంచగామ బీరప్ప మాట్లాడుతూ… పేద, మధ్యతరగతి మహిళలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు వారి గౌరవం, ఆత్మవిశ్వాసం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి అర్హురాలైన మహిళకు చీర అందజేస్తామని స్పష్టం చేశారు. మహిళలు కుటుంబానికే కాదు, సమాజ నిర్మాణానికి కూడా పునాదులని పేర్కొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో ప్రత్యక్షంగా ప్రజల చేతికి చేరుతున్నాయంటే అది ప్రజా ప్రభుత్వం–ప్రజా పాలన కృషికి నిదర్శనమని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళల జీవితాల్లో ప్రభుత్వ పథకాలు మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సామాజిక సమానత్వానికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, అందుకే మహిళా సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని పథకాలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి గ్రామస్థాయిలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సక్రమంగా అమలయ్యేలా ప్రజలంతా సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు సాయమ్మ, వీఓఏ బైండ్ల అనసుజ, వార్డు సభ్యుడు బాలకృష్ణ, గ్రామ దేవస్థానం చైర్మన్ మల్లయ్య, గ్రామ పెద్దలు నర్సింహులు, యువత, వివిధ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News