Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:32 AM

మహబూబాబాద్‌లో అకాల వర్షం ఎఫెక్ట్

మహబూబాబాద్‌లో అకాల వర్షం ఎఫెక్ట్

మహబూబాబాద్‌లో అకాల వర్షం ఎఫెక్ట్
24-02-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

40 క్వింటాళ్ల మిర్చి తడిసి నష్టపోయిన మహిళా రైతు

మహబూబాబాద్ జిల్లాలోని సీరోలు మండలం కాంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. కోతకు సిద్ధంగా కళ్లెంలో ఎండబెట్టిన మిర్చి పూర్తిగా తడిసి ముద్దయింది.

సక్రం నాయక్ తండాకు చెందిన మహిళా రైతు బానోతు అంకి లక్ష్మణ్‌కు చెందిన సుమారు 40 క్వింటాళ్ల మిర్చి వర్షానికి తడిసి నష్టపోయింది. మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన పంట ఒక్కసారిగా వర్షం కురవడంతో నాణ్యత దెబ్బతింది. దీంతో భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

అకాల వర్షాలతో ఇప్పటికే ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ ఘటన మరింత భారంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Sthanikam

మహబూబాబాద్‌లో అకాల వర్షం ఎఫెక్ట్

Article Image

40 క్వింటాళ్ల మిర్చి తడిసి నష్టపోయిన మహిళా రైతు

మహబూబాబాద్ జిల్లాలోని సీరోలు మండలం కాంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. కోతకు సిద్ధంగా కళ్లెంలో ఎండబెట్టిన మిర్చి పూర్తిగా తడిసి ముద్దయింది.

సక్రం నాయక్ తండాకు చెందిన మహిళా రైతు బానోతు అంకి లక్ష్మణ్‌కు చెందిన సుమారు 40 క్వింటాళ్ల మిర్చి వర్షానికి తడిసి నష్టపోయింది. మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన పంట ఒక్కసారిగా వర్షం కురవడంతో నాణ్యత దెబ్బతింది. దీంతో భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

అకాల వర్షాలతో ఇప్పటికే ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ ఘటన మరింత భారంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News