Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:52 PM

మహబూబాబాద్‌లో అకాల వర్షం ఎఫెక్ట్

మహబూబాబాద్‌లో అకాల వర్షం ఎఫెక్ట్

మహబూబాబాద్‌లో అకాల వర్షం ఎఫెక్ట్
February 24, 2026 01:09 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

40 క్వింటాళ్ల మిర్చి తడిసి నష్టపోయిన మహిళా రైతు

మహబూబాబాద్ జిల్లాలోని సీరోలు మండలం కాంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. కోతకు సిద్ధంగా కళ్లెంలో ఎండబెట్టిన మిర్చి పూర్తిగా తడిసి ముద్దయింది.

సక్రం నాయక్ తండాకు చెందిన మహిళా రైతు బానోతు అంకి లక్ష్మణ్‌కు చెందిన సుమారు 40 క్వింటాళ్ల మిర్చి వర్షానికి తడిసి నష్టపోయింది. మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన పంట ఒక్కసారిగా వర్షం కురవడంతో నాణ్యత దెబ్బతింది. దీంతో భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

అకాల వర్షాలతో ఇప్పటికే ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ ఘటన మరింత భారంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News