40 క్వింటాళ్ల మిర్చి తడిసి నష్టపోయిన మహిళా రైతు
మహబూబాబాద్ జిల్లాలోని సీరోలు మండలం కాంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. కోతకు సిద్ధంగా కళ్లెంలో ఎండబెట్టిన మిర్చి పూర్తిగా తడిసి ముద్దయింది.
సక్రం నాయక్ తండాకు చెందిన మహిళా రైతు బానోతు అంకి లక్ష్మణ్కు చెందిన సుమారు 40 క్వింటాళ్ల మిర్చి వర్షానికి తడిసి నష్టపోయింది. మార్కెట్కు తరలించేందుకు సిద్ధం చేసిన పంట ఒక్కసారిగా వర్షం కురవడంతో నాణ్యత దెబ్బతింది. దీంతో భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.
అకాల వర్షాలతో ఇప్పటికే ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ ఘటన మరింత భారంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి