Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి మంచి డిమాండ్

మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి మంచి డిమాండ్

మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి మంచి డిమాండ్
January 06, 2026 02:24 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి మంచి డిమాండ్ వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మంగళవారం రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ...గ్రామాల్లో సరిపోను బస్సులను ఏర్పటు చేయాలన్నారు,ఉమ్మడి జిల్లాలోని యాదగిరిగుట్ట పెద్ద డిపో కావున ఎక్కువ ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించాలని కోరారు.గ్రామాల్లో పాఠశాలలకు సెలవులు వచ్చిన సమయంలో బస్సులు నడవటం లేదు,పాఠశాలకు సెలవులు ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ బస్సులను నడపాలని కోరారు. మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు ఏర్పాటు చేయడం వల్ల,ఆర్టీసీకి మంచి డిమాండ్ ఉందన్నారు. మహిళలు అన్ని సమయంలో ఆర్టీసీబస్సు సేవలను వినియోగించుకుంటున్నారని అన్నారు.కావున యాదగిరిగుట్ట డిపోకు ఎలక్ట్రికల్ బస్సులను అందజేయాలని కోరారు. తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైకి వెళ్లే బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మీ పథకం వర్తిచటం లేదు,దీని ద్వార నెలకు వచ్చే ఆలయ ఆదాయంలో డిపోకు ఎక్కువ కట్టవలసి వస్తుందని,కొండపైకి వెళ్లే బస్సులో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం వర్తించే లాగా చూడాలన్నారు.ప్రతి గ్రామానికి నూతనంగా ఎలక్ట్రికల్ బస్సులను పునరుద్ధరించాలని కోరారు.గత పది ఏళ్లలో ఆర్టీసీ ధర్నాలు చేసి ఎంతో మంది చనిపోయారు.మన ప్రజాపాలన ప్రభుత్వంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల్లోకి వచ్చి పరిరక్షించి ఆదుకున్నామన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News