Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:24 PM

మాఘ అమావాస్యకు ఘనంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు

మాఘ అమావాస్యకు ఘనంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు

మాఘ అమావాస్యకు ఘనంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు
January 18, 2026 09:00 AM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం మాఘ అమావాస్యను పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలతో అలంకరించి ప్రాతఃకాల పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు మొక్కులు తీర్చుకుంటూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో మంజీర నది ఒడ్డున కొలువై ఉన్న శ్రీ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం ఎంతో మహిమాన్వితమైనదని తెలిపారు. అమ్మవారికి చేసే మొక్కులు ఎంతో ప్రాముఖ్యత కలవని, భక్తుల కోరికలను నెరవేర్చే శక్తి కలిగిన దేవతగా అమ్మవారు ప్రసిద్ధి చెందినారని పేర్కొన్నారు.ప్రత్యేకించి మాఘ అమావాస్య వంటి పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తుల నినాదాలతో, ఆధ్యాత్మిక వాతావరణంతో పులకరించిపోయాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News