Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 12:41 AM

మాఘ అమావాస్యకు ఘనంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు

మాఘ అమావాస్యకు ఘనంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు

మాఘ అమావాస్యకు ఘనంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు
January 18, 2026 09:00 AM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం మాఘ అమావాస్యను పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలతో అలంకరించి ప్రాతఃకాల పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు మొక్కులు తీర్చుకుంటూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో మంజీర నది ఒడ్డున కొలువై ఉన్న శ్రీ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం ఎంతో మహిమాన్వితమైనదని తెలిపారు. అమ్మవారికి చేసే మొక్కులు ఎంతో ప్రాముఖ్యత కలవని, భక్తుల కోరికలను నెరవేర్చే శక్తి కలిగిన దేవతగా అమ్మవారు ప్రసిద్ధి చెందినారని పేర్కొన్నారు.ప్రత్యేకించి మాఘ అమావాస్య వంటి పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తుల నినాదాలతో, ఆధ్యాత్మిక వాతావరణంతో పులకరించిపోయాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News