PRINT TIME: April 10, 2026 09:12 AM
మెగా క్రీడోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలి బీజేపీ మెగా క్రీడోత్సవ సన్నాహక సమావేశంలో నకిరేకంటి మొగులయ్య
మెగా క్రీడోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలి బీజేపీ మెగా క్రీడోత్సవ సన్నాహక సమావేశంలో నకిరేకంటి మొగులయ్య
January 06, 2026 02:56 PM
43 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట: భువనగిరి పార్లమెంట్ పరిధిలో నిర్వహించనున్న మెగా క్రీడోత్సవాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నకిరేకల్ ఇంచార్జ్ నకిరేకంటి మొగులయ్య పిలుపునిచ్చారు. గురువారం రామన్నపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి అధ్యక్షతన భువనగిరి పార్లమెంట్ మెగా క్రీడోత్సవం (ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం) సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మొగులయ్య మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మండల, నియోజకవర్గ, పార్లమెంట్ స్థాయిల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, కోకో వంటి క్రీడలను పార్లమెంట్ పరిధిలో నిర్వహించనున్న నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల యువత ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వనం అంజయ్య, బీజేపీ సీనియర్ నాయకులు డోగుపర్తి సుభాష్, యువమోర్చా జిల్లా కార్యదర్శి అక్కినపల్లి సైదులు, మండల ప్రధాన కార్యదర్శి జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్, మండల ఉపాధ్యక్షుడు కంభంపాటి శివరంజన్, కార్యదర్శులు బందెల సంజీవ్, రేపాక లింగస్వామి, నాయకులు రాపోలు రమేష్, సింగు శంకర్ రెడ్డి, బొడ్డు పెల్లి సైదులు, మేడి పరశురాం, ఐలాపురం అశోక్, గురజాల నవీన్ రెడ్డి, గురజాల నిరంజన్ రెడ్డి, దాకోజి నాగరాజు, కంచి రమేష్, ఎర్రబోయిన వెంకన్న, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి