Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:01 AM

మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సేవలు చిరస్మరణీయం

మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సేవలు చిరస్మరణీయం

మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సేవలు చిరస్మరణీయం
January 04, 2026 07:18 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

శ్రీ సాయి యాదాద్రి సేవాశ్రమం అద్యక్షులు దెబ్బడి అశోక్,జేవై శెట్టి ప్రధాన కార్యదర్శి

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో:జి.శ్రీనివాస్(స్థానికం: జనవరి 04)

తమ స్వంత వ్యవసాయ భూమిలోని ఒక ఎకరం స్థలంలో సుమారు కోటి రూపాయల ఖర్చుతో భవనం నిర్మాణం చేసి, ప్రభుత్వం తరపున నడిపించే వృద్ధాశ్రమానికి దానం చేసిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సేవలు ఎల్లకాలం నిలిచిపోతాయని శ్రీ సాయి యాదాద్రి సేవాశ్రమం అద్యక్షులు దెబ్బడి అశోక్,ప్రధాన కార్యదర్శి జే.వై శెట్టి అన్నారు.ఆదివారం చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామంలో జరిగిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సంస్మరణ సభలో వారు మాట్లాడారు. మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పెద్ద కొండూరు గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి,పెరిగి ప్రభుత్వ ఉపాద్యాయులుగా సేవలందించి,ఉద్యోగ విరమణ తర్వాత గ్రామంలో ఒక వృద్ధాశ్రమం ను నిర్మించి సీనియర్ సిటిజన్ లకు సేవాకార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకోవడం హర్షణీయమని వారన్నారు. ఈ సంస్మరణ సభలో సత్యనారాయణ రెడ్డి పెద్ద కుమార్తె కల్పన మాట్లాడుతూ మా తండ్రిగారైన సత్యనారాయణ రెడ్డి సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శం కావాలని కోరారు. తన తండ్రి గారైన సత్యనారాయణ రెడ్డి నెలకొల్పిన వృద్ధాశ్రమం పలువురు కి సేవలందించే విధంగా సహకారం అందించాలని ఆమె కోరారు.ఈ సంస్మరణ సభలో ఆశ్రమ వ్యవస్థాపకులు మేరెడ్డి జానకమ్మ, శ్రీ సాయి యాదాద్రి సేవాశ్రమం గౌరవ సలహాదారులు నేరెళ్ళ‌‌‌ కోటేశ్వరరావు, ఆర్గనైజర్ మహేష్,యాదాద్రి భువనగిరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ,జిల్లా డైరెక్టర్స్ కొడారి వెంకటేష్,జంపాల అంజయ్య,మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి చిన్న కూతురు వినీత,పెద్దలు పాటి యాదిరెడ్డి,కళ్ళెం బాల్ రెడ్డి,డాక్టర్ రాజా సుధాకర్,మాదగోని బిక్షపతి గౌడ్,ఆశ్రమ దాతలు,రిటైర్డ్ ఉద్యోగులు,ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News