Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:47 PM

మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సేవలు చిరస్మరణీయం

మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సేవలు చిరస్మరణీయం

మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సేవలు చిరస్మరణీయం
January 04, 2026 07:18 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

శ్రీ సాయి యాదాద్రి సేవాశ్రమం అద్యక్షులు దెబ్బడి అశోక్,జేవై శెట్టి ప్రధాన కార్యదర్శి

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో:జి.శ్రీనివాస్(స్థానికం: జనవరి 04)

తమ స్వంత వ్యవసాయ భూమిలోని ఒక ఎకరం స్థలంలో సుమారు కోటి రూపాయల ఖర్చుతో భవనం నిర్మాణం చేసి, ప్రభుత్వం తరపున నడిపించే వృద్ధాశ్రమానికి దానం చేసిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సేవలు ఎల్లకాలం నిలిచిపోతాయని శ్రీ సాయి యాదాద్రి సేవాశ్రమం అద్యక్షులు దెబ్బడి అశోక్,ప్రధాన కార్యదర్శి జే.వై శెట్టి అన్నారు.ఆదివారం చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామంలో జరిగిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సంస్మరణ సభలో వారు మాట్లాడారు. మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పెద్ద కొండూరు గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి,పెరిగి ప్రభుత్వ ఉపాద్యాయులుగా సేవలందించి,ఉద్యోగ విరమణ తర్వాత గ్రామంలో ఒక వృద్ధాశ్రమం ను నిర్మించి సీనియర్ సిటిజన్ లకు సేవాకార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకోవడం హర్షణీయమని వారన్నారు. ఈ సంస్మరణ సభలో సత్యనారాయణ రెడ్డి పెద్ద కుమార్తె కల్పన మాట్లాడుతూ మా తండ్రిగారైన సత్యనారాయణ రెడ్డి సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శం కావాలని కోరారు. తన తండ్రి గారైన సత్యనారాయణ రెడ్డి నెలకొల్పిన వృద్ధాశ్రమం పలువురు కి సేవలందించే విధంగా సహకారం అందించాలని ఆమె కోరారు.ఈ సంస్మరణ సభలో ఆశ్రమ వ్యవస్థాపకులు మేరెడ్డి జానకమ్మ, శ్రీ సాయి యాదాద్రి సేవాశ్రమం గౌరవ సలహాదారులు నేరెళ్ళ‌‌‌ కోటేశ్వరరావు, ఆర్గనైజర్ మహేష్,యాదాద్రి భువనగిరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ,జిల్లా డైరెక్టర్స్ కొడారి వెంకటేష్,జంపాల అంజయ్య,మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి చిన్న కూతురు వినీత,పెద్దలు పాటి యాదిరెడ్డి,కళ్ళెం బాల్ రెడ్డి,డాక్టర్ రాజా సుధాకర్,మాదగోని బిక్షపతి గౌడ్,ఆశ్రమ దాతలు,రిటైర్డ్ ఉద్యోగులు,ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News