Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:07 AM

మేడ్చల్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి అదృశ్యం.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

మేడ్చల్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి అదృశ్యం.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

మేడ్చల్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి అదృశ్యం.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
December 26, 2025 11:33 AM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రుల వేడుకోలు
మేడ్చల్/అత్వెల్లి, ( స్థానికం): మేడ్చల్ జిల్లా అత్వెల్లిలోని సెయింట్ జాన్స్ అకాడమీ (St. Johns Academy) పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మహేశ్వరం కార్తీక్ (14) అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత కొన్ని రోజులుగా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, పెద్దకాపర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం కార్తీక్, మేడ్చల్ లోని అత్వెల్లిలో ఉంటూ సెయింట్ జాన్స్ అకాడమీలో చదువుకుంటున్నాడు. అయితే బాలుడు పాఠశాల నుండి అదృశ్యమయ్యాడని, ఎంత వెతికినా జాడ తెలియరాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే దయచేసి సమాచారం అందించి పుణ్యం కట్టుకోవాలని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేశారు.
ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాల్సిన వివరాలు:
బాలుడి వివరాలు లేదా ఆచూకీ తెలిసిన వారు వెంటనే కింద ఇచ్చిన ఫోన్ నంబర్‌కు లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
పేరు: మహేశ్వరం కార్తీక్
వయస్సు: 14 సంవత్సరాలు
చదువు: 9వ తరగతి
స్వగ్రామం: పెద్దకాపర్తి, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా
సంప్రదించాల్సిన నంబర్: 79956 41290
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News