Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:44 PM

మధ్యవర్తుల నుంచి దూరంగా ఉండండి – ఎమ్మెల్యే సూచన

మధ్యవర్తుల నుంచి దూరంగా ఉండండి – ఎమ్మెల్యే సూచన

మధ్యవర్తుల నుంచి దూరంగా ఉండండి – ఎమ్మెల్యే సూచన
April 03, 2026 03:17 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రైతులకు న్యాయం చేయడం, వారి పంటలకు తగిన ధర కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. నిజాంపేట్ మండలం బాచేపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఎంతో శ్రమించి పండించిన పంటకు సరైన ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం శనగలకు ప్రభుత్వం క్వింటాలుకు రూ. 5,875 మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు మధ్యవర్తులను నమ్మి నష్టపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ పంటను విక్రయించి లాభపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల రైతులు, సంఘం అధ్యక్షులు, నిర్వాహకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News