Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి పిల్లవాడూ ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలి: సర్పంచ్ రాధా శ్రీనివాస్ “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 05:02 PM

మధ్యవర్తుల నుంచి దూరంగా ఉండండి – ఎమ్మెల్యే సూచన

మధ్యవర్తుల నుంచి దూరంగా ఉండండి – ఎమ్మెల్యే సూచన

మధ్యవర్తుల నుంచి దూరంగా ఉండండి – ఎమ్మెల్యే సూచన
April 03, 2026 03:17 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రైతులకు న్యాయం చేయడం, వారి పంటలకు తగిన ధర కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. నిజాంపేట్ మండలం బాచేపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఎంతో శ్రమించి పండించిన పంటకు సరైన ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం శనగలకు ప్రభుత్వం క్వింటాలుకు రూ. 5,875 మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు మధ్యవర్తులను నమ్మి నష్టపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ పంటను విక్రయించి లాభపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల రైతులు, సంఘం అధ్యక్షులు, నిర్వాహకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News