మధ్యవర్తుల నుంచి దూరంగా ఉండండి – ఎమ్మెల్యే సూచన
మధ్యవర్తుల నుంచి దూరంగా ఉండండి – ఎమ్మెల్యే సూచన
Krishna
రైతులకు న్యాయం చేయడం, వారి పంటలకు తగిన ధర కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. నిజాంపేట్ మండలం బాచేపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఎంతో శ్రమించి పండించిన పంటకు సరైన ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం శనగలకు ప్రభుత్వం క్వింటాలుకు రూ. 5,875 మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు మధ్యవర్తులను నమ్మి నష్టపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ పంటను విక్రయించి లాభపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల రైతులు, సంఘం అధ్యక్షులు, నిర్వాహకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి