మాధక ద్రవ్యాల నిర్మూలన – మన కర్తవ్యం: కార్తిక్, శ్రీనిధి సన్మానం
మాధక ద్రవ్యాల నిర్మూలన – మన కర్తవ్యం: కార్తిక్, శ్రీనిధి సన్మానం
Krishna
రాజేందర్ నగర్లోని వాలంతరీ రీసర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో పీయం శ్రీ ప్రహరీ క్లబ్ సభ్యుల మాధక ద్రవ్యాల నిర్మూలన – మన కర్తవ్యం అనే రెండు రోజుల తెలంగాణ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ శిక్షణలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.నారాయణఖేడ్ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కార్తిక్, శ్రీనిధి ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారు. శిక్షణలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, యువత భవిష్యత్తుపై వాటి ప్రభావం, నివారణ చర్యల గురించి అవగాహన కల్పించబడింది.యాంటీ నార్కోటిక్ ఎస్పీ సీతారాం ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద ఘటనలు గమనించినట్లయితే వెంటనే 1908 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థి కార్తిక్ను ఎస్పీ సీతారాం మెడల్తో సత్కరించారు. ఈ విజయంపై పాఠశాల హెచ్ఎం మన్మధ కిషోర్, ఉపాధ్యాయులు రాజశేఖర్, చంద్రశేఖర్ ఆచార్యలు కార్తిక్కు అభినందనలు తెలియజేశారు.కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యతాభావం పెరిగింది, మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం స్పష్టమైంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి