Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:57 PM

మాధక ద్రవ్యాల నిర్మూలన – మన కర్తవ్యం: కార్తిక్, శ్రీనిధి సన్మానం

మాధక ద్రవ్యాల నిర్మూలన – మన కర్తవ్యం: కార్తిక్, శ్రీనిధి సన్మానం

మాధక ద్రవ్యాల నిర్మూలన – మన కర్తవ్యం: కార్తిక్, శ్రీనిధి సన్మానం
February 17, 2026 02:46 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాజేందర్ నగర్‌లోని వాలంతరీ రీసర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో పీయం శ్రీ ప్రహరీ క్లబ్ సభ్యుల మాధక ద్రవ్యాల నిర్మూలన – మన కర్తవ్యం అనే రెండు రోజుల తెలంగాణ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ శిక్షణలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.నారాయణఖేడ్ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కార్తిక్, శ్రీనిధి ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారు. శిక్షణలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, యువత భవిష్యత్తుపై వాటి ప్రభావం, నివారణ చర్యల గురించి అవగాహన కల్పించబడింది.యాంటీ నార్కోటిక్ ఎస్‌పీ సీతారాం ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద ఘటనలు గమనించినట్లయితే వెంటనే 1908 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థి కార్తిక్‌ను ఎస్‌పీ సీతారాం మెడల్‌తో సత్కరించారు. ఈ విజయంపై పాఠశాల హెచ్‌ఎం మన్మధ కిషోర్, ఉపాధ్యాయులు రాజశేఖర్, చంద్రశేఖర్ ఆచార్యలు కార్తిక్‌కు అభినందనలు తెలియజేశారు.కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యతాభావం పెరిగింది, మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం స్పష్టమైంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News