మద్యపాన నిషేధానికి గ్రామస్తుల తీర్మానం
మద్యపాన నిషేధానికి గ్రామస్తుల తీర్మానం
Vaddeman Suresh
వలిగొండ స్థానికం ప్రతినిధి:
వలిగొండ మండల పరిధిలోని ముద్దాపురం గ్రామంలో నేటి నుండి బెల్టు షాపుల ద్వారా హోటళ్ల ద్వారా గ్రామంలో మద్యం విక్రయించకూడదని 26 జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్,పాలకవర్గం,గ్రామ ప్రజలు,మహిళా సంఘాలు,యువజన సంఘాలు గ్రామంలో సంపూర్ణ మద్యపానానికి తీర్మానం చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో మద్యం విక్రయం చేస్తే గ్రామ ప్రజల తీర్మానం ప్రకారం 50 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.
గ్రామంలో మద్యపానం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రమాదాల బారిన పడి తనువులు చాలిస్తున్నారని గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికై తీర్మానం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సామ సరస్వతి రాంరెడ్డి,ఉపసర్పంచ్ బడక శ్రీనివాస్ వార్డు సభ్యులు గూడూరు సుగుణమ్మ,సామ రాజేందర్ రెడ్డి,సామల చైతన్య,బత్తుల భిక్షం వాకిటి కొండల్ రెడ్డి,జక్క వెంకట్ రెడ్డి,సామ రాంరెడ్డి,గుర్రం కిష్టారెడ్డి,యం నవీన్,సునీత,పద్మ,బుచ్చమ్మ,పూలమ్మ,ఎస్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి