మద్వార్ గ్రామంలో ఘనంగా క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్ ప్రారంభించిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్
మద్వార్ గ్రామంలో ఘనంగా క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్ ప్రారంభించిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఖేడ్ మండలం మద్వార్ గ్రామంలో గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు నిర్వహించిన క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్ను ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో ఆత్మీయంగా పరిచయం చేసుకుని, ఆటలో గెలుపోటములు సహజమని, ఓటమిని సవాలుగా తీసుకుని మరింత కృషి చేస్తే మంచి విజయాలు సాధించవచ్చని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు యువతలో ప్రతిభ, క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. యువత క్రీడలతో పాటు విద్యలో కూడా రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఖేడ్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివరాజ్, మద్వార్ సర్పంచ్ స్వరూప్ సంజీవులు, లింగనాయక్పల్లి సర్పంచ్ లక్ష్మి భూమయ్య, మద్వార్ తండా సర్పంచ్ సర్దార్, లింగాపూర్ సర్పంచ్ హనుమడ్లు, ఇడిగి రామగౌడ్, దుర్గయ్య, శంకర్, కృష్ణ, నాగయ్యతో పాటు గ్రామ ముఖ్య నాయకులు, యువకులు మరియు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి