PRINT TIME: April 11, 2026 04:20 PM
మద్దులపల్లిలో పోలింగ్ సరళి పరిశీలన
మద్దులపల్లిలో పోలింగ్ సరళి పరిశీలన
February 12, 2026 06:41 AM
83 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన
ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి గ్రామం 17వ వార్డులో పోలింగ్ సరళిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లు, ఓటర్ల హాజరు తదితర అంశాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా 17వ డివిజన్ అభ్యర్థి గొడ్డు గొర్ల కృష్ణకుమారి, గురు నారాయణ, జొన్నలగడ్డ రవికుమార్, జూకూరి గోపాలరావు పాల్గొన్నారు. సర్పంచ్ అంబేద్కర్ చాట్ల పరుశురాం, స్థానిక నాయకులు ఏటుకూరి సుధాకర్, అంబాటి సుబ్బారావు, నల్లప్పనేని వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, సతీష్, గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు నాయకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి