PRINT TIME: July 11, 2026 01:48 AM
మాచిరెడ్డి పల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ
మాచిరెడ్డి పల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ
April 03, 2026 01:21 PM
115 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
నాగారం మండలం మాచిరెడ్డి పల్లిలో గాదం రేణుక యాకయ్య ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు, మాజీ డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య హాజరై గృహప్రవేశాన్ని శుభాకాంక్షలతో అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగారం మండల పార్టీ అధ్యక్షుడు తొడుసు లింగయ్య యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు ఆకుల బుచ్చిబాబు, సర్పంచ్ వడ్డే వెంకన్న, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి