మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళేవారికి కఠిన హెచ్చరిక
మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళేవారికి కఠిన హెచ్చరిక
Krishna
కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :ఇటీవల యువతలో చిన్నపెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్లడం, మాటలు చెప్పి వెంట పడడం, చివరకు తీసుకెళ్ళే ప్రయత్నాలు పెరుగుతున్నాయి.ఇలాంటి చర్యలు పిల్లల భవిష్యత్తుకు ఘాతుకరమైన నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి హెచ్చరిస్తున్నారు,ఎవరైనా మైనర్ అమ్మాయిని తీసుకెళ్లినా లేదా తీసుకెళ్లేందుకు సహకరించినా పోకో చట్టం ప్రకారం 14 ఏళ్ల నుండి యావజీవ శిక్ష తప్పదు. ఈ చట్టం కేవలం తీసుకెళ్లడాన్ని మాత్రమే కాక, సహకరించడం, ప్రేరేపించడం కూడా కవర్ చేస్తుంది.తల్లిదండ్రులు పిల్లలపై మరింత శ్రద్ధ చూపాలి. ఫోన్లు, చాటింగ్, సామాజిక సంబంధాలు అన్నీ గమనిస్తూ, ప్రమాదం జరిగే అవకాశాలను తగ్గించాలి. యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి