ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల పరిధిలో ని
మేడికుంద గ్రామ పంచాయతీకి 2025 సంవత్సరంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్రీమతి నాలచెరు చంద్రకళ, గ్రామ కార్యదర్శి కే.చరణ్ రాజ్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు తొలి పాలకవర్గ (బాడీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంచినీటి సరఫరా, పారిశుద్యం, నర్సరీ నిర్వహణ, విద్యుత్ సమస్యలు, నిరుపయోగ చెట్ల తొలగింపు, నల్లాలకు మూతలు ఏర్పాటు, బోర్ మోటార్ల సంరక్షణ, నీళ్లు వదిలే పనిమనిషి నియామకం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి అవసరమైన తీర్మానాలు చేశారు. గ్రామాభివృద్ధికి అందరి సహకారంతో పనిచేస్తామని సర్పంచ్ నాలచెరు చంద్రకళ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి