Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:12 AM

మాట నిలబెట్టుకున్న సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్… రంగమ్మగూడెం ప్రజలకు రేషన్ సౌకర్యం

మాట నిలబెట్టుకున్న సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్… రంగమ్మగూడెం ప్రజలకు రేషన్ సౌకర్యం

మాట నిలబెట్టుకున్న సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్… రంగమ్మగూడెం ప్రజలకు రేషన్ సౌకర్యం
January 06, 2026 06:20 AM 167 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

మండలంలోని రంగమ్మగూడెం గ్రామ ప్రజలకు గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్ నిలబెట్టుకున్నారు. ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామస్తుల ఆకాంక్షకు రూపం దాల్చుతూ, రంగమ్మగూడెం గ్రామానికి రేషన్ డీలర్ ఏర్పాటు చేసి ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభించారు.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి పరిధిలోని రంగమ్మగూడెం గ్రామంలో సోమవారం లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం గ్రామానికి రేషన్ సౌకర్యం కల్పించడం ద్వారా సర్పంచ్ మాట నిలబెట్టుకున్నారని గ్రామస్తులు అభినందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్‌తో పాటు 10వ వార్డు సభ్యుడు వంగాల అవినాష్‌కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నడిగోటి పాండు, పంచాయతీ కార్యదర్శి ఉమాశంకర్, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ పిట్ట రాంరెడ్డి, వార్డు సభ్యులు నడిగోటి నరేష్, ముద్రపోయిన శ్రీశైలం, బుర్ర నాగేష్, చిల్ల చంద్రశేఖర్, కన్నెబోయిన బాలకృష్ణ, మాజీ వార్డు సభ్యుడు గునుగంటి సురేందర్ రావు, బోడ నరసింహ, వెంకన్న, కిషన్ రావు, నడిగోటి గణేష్, వేముల దయాకర్, శిగ వెంకటయ్య, సూరయ్య, ముద్రబోయిన మల్లేష్, కన్నెబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News