మాట నిలబెట్టుకున్న సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్… రంగమ్మగూడెం ప్రజలకు రేషన్ సౌకర్యం
మాట నిలబెట్టుకున్న సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్… రంగమ్మగూడెం ప్రజలకు రేషన్ సౌకర్యం
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి
మండలంలోని రంగమ్మగూడెం గ్రామ ప్రజలకు గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్ నిలబెట్టుకున్నారు. ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామస్తుల ఆకాంక్షకు రూపం దాల్చుతూ, రంగమ్మగూడెం గ్రామానికి రేషన్ డీలర్ ఏర్పాటు చేసి ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభించారు.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి పరిధిలోని రంగమ్మగూడెం గ్రామంలో సోమవారం లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం గ్రామానికి రేషన్ సౌకర్యం కల్పించడం ద్వారా సర్పంచ్ మాట నిలబెట్టుకున్నారని గ్రామస్తులు అభినందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్తో పాటు 10వ వార్డు సభ్యుడు వంగాల అవినాష్కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నడిగోటి పాండు, పంచాయతీ కార్యదర్శి ఉమాశంకర్, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ పిట్ట రాంరెడ్డి, వార్డు సభ్యులు నడిగోటి నరేష్, ముద్రపోయిన శ్రీశైలం, బుర్ర నాగేష్, చిల్ల చంద్రశేఖర్, కన్నెబోయిన బాలకృష్ణ, మాజీ వార్డు సభ్యుడు గునుగంటి సురేందర్ రావు, బోడ నరసింహ, వెంకన్న, కిషన్ రావు, నడిగోటి గణేష్, వేముల దయాకర్, శిగ వెంకటయ్య, సూరయ్య, ముద్రబోయిన మల్లేష్, కన్నెబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి