Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:12 AM

మాట నిలబెట్టుకున్న సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్… రంగమ్మగూడెం ప్రజలకు రేషన్ సౌకర్యం

మాట నిలబెట్టుకున్న సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్… రంగమ్మగూడెం ప్రజలకు రేషన్ సౌకర్యం

మాట నిలబెట్టుకున్న సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్… రంగమ్మగూడెం ప్రజలకు రేషన్ సౌకర్యం
January 06, 2026 06:20 AM 178 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

మండలంలోని రంగమ్మగూడెం గ్రామ ప్రజలకు గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్ నిలబెట్టుకున్నారు. ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామస్తుల ఆకాంక్షకు రూపం దాల్చుతూ, రంగమ్మగూడెం గ్రామానికి రేషన్ డీలర్ ఏర్పాటు చేసి ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభించారు.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి పరిధిలోని రంగమ్మగూడెం గ్రామంలో సోమవారం లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం గ్రామానికి రేషన్ సౌకర్యం కల్పించడం ద్వారా సర్పంచ్ మాట నిలబెట్టుకున్నారని గ్రామస్తులు అభినందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్‌తో పాటు 10వ వార్డు సభ్యుడు వంగాల అవినాష్‌కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నడిగోటి పాండు, పంచాయతీ కార్యదర్శి ఉమాశంకర్, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ పిట్ట రాంరెడ్డి, వార్డు సభ్యులు నడిగోటి నరేష్, ముద్రపోయిన శ్రీశైలం, బుర్ర నాగేష్, చిల్ల చంద్రశేఖర్, కన్నెబోయిన బాలకృష్ణ, మాజీ వార్డు సభ్యుడు గునుగంటి సురేందర్ రావు, బోడ నరసింహ, వెంకన్న, కిషన్ రావు, నడిగోటి గణేష్, వేముల దయాకర్, శిగ వెంకటయ్య, సూరయ్య, ముద్రబోయిన మల్లేష్, కన్నెబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News