PRINT TIME: April 12, 2026 12:13 AM
మార్డి గ్రామ నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ అండ
మార్డి గ్రామ నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ అండ
January 07, 2026 08:05 PM
23 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నిత్యం నిరుపేదలకు సేవలందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటింది. కల్హేర్ మండలం మార్డి గ్రామానికి చెందిన పడమటి మరియమ్మ ఇటీవల మృతి చెందడంతో, ఆమె కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి వచ్చింది.ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే స్పందించిన మచ్చేందర్, జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి నెలకు సరిపడే నిత్యవసర సరుకులను అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఆయన, భవిష్యత్తులో కూడా ఫౌండేషన్ తరఫున సహాయ సహకారాలు కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి